10 ఏళ్లుగా అత‌డితో ప్రేమ‌లో సాయి ప‌ల్ల‌వి..!

త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచి ఉంది సాయి ప‌ల్ల‌వి. ఈ భామ నృత్యాల‌కు ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉంది

Update: 2024-09-02 15:42 GMT

త‌న‌దైన అందం, ప్ర‌తిభ‌తో ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచి ఉంది సాయి ప‌ల్ల‌వి. ఈ భామ నృత్యాల‌కు ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ఉంది. ఎన‌ర్జిటిక్ డ్యాన్సుల‌తో యువ‌హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. త‌న‌ను ఆరాధించే కుర్రాళ్లు ల‌క్ష‌ల్లో ఉన్నారు. అందుకే ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి ప్రేమ‌లో ప‌డింద‌ని తెలియ‌గానే వీరంతా ఖంగు తింటున్నారు. ఇంత‌కీ సాయిప‌ల్ల‌వి ఎవ‌రితో ప్రేమ‌లో ఉంది? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

అవును.. నిజంగానే డాక్ట‌ర్ సాయిప‌ల్ల‌వి ప్రేమ‌లో ఉంది. కానీ అది ఒక సాధార‌ణ‌ యువ‌కుడితో కాదు.. ఒక వీరాధివీరుడి కుమారుడితో ప్రేమ‌లో ప‌డింది. ఇంత‌కీ ఎవ‌రా వీరుడు? అంటే పౌరాణిక జాన‌ప‌ద కాలానికి వెళ్లాల్సి ఉంది. రణబీర్ కపూర్ శ్రీ‌రాముడిగా నటిస్తున్న రామాయ‌ణంలో సీత‌గా నటిస్తున్న‌ సాయి పల్లవి మ‌హాభార‌తం గురించి ప్ర‌స్థావించింది. భార‌తంలో అర్జునుడి కుమారుడు అభిమ‌న్యుడితో తాను ప్రేమ‌లో ఉన్నాన‌ని తెలిపింది. అభిమ‌న్యుడి పాత్ర త‌న‌ను ప్రేమ ముగ్గులోకి దించింద‌ని కూడా వెల్ల‌డించింది.

ఓ ఇంటర్వ్యూలో తన ల‌వ్ లైఫ్ గురించి హోస్ట్ ప్ర‌శ్నించ‌గా..తాను అభిమన్యుతో ప్రేమలో ఉన్నానని, గత 10 సంవత్సరాలుగా అత‌డితోనే ప్రేమ‌లో ఉండిపోయాన‌ని చెప్పింది. అభిమన్యుడు పాండవులలో ఒకరైన అర్జునుడి కుమారుడు. ప్ర‌జ‌లంతా మెచ్చే మహాభారతంలోని ఒక కీల‌క‌ పాత్రధారి అని మ‌నంద‌రికీ తెలుసు. సాయిప‌ల్ల‌వి మాట్లాడుతూ -``మహాభారతం అంటే నాకు చాలా గౌరవం. నేను అర్జునుడి కొడుకు అభిమన్యుడిని ప్రేమిస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా నేను అభిమన్యు గురించి చాలా చదివి తెలుసుకున్నాను. గత 10 సంవత్సరాలుగా అతనితో ప్రేమలో ఉన్నాను`` అని సాయి పల్లవి చెప్పింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇతిహాసాలు పురాణ పురుషుల‌ను ప్రేమిస్తే ఎలా! ఇప్పుడున్న‌ యూత్ అంతా ఏమైపోవాలి? అంటూ కుర్రాళ్లు ఆందోళ‌న చెందుతున్నారు.

సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్య సరసన `తండేల్‌` చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా పూర్త‌వుతోంది. 2018లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుండి మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ స‌ముద్ర‌ జలాల్లోకి వెళ్లి ముష్క‌రుల‌కు చిక్కాక‌ ఏం జ‌రిగింద‌న్న‌దే తండేల్ సినిమా.

Tags:    

Similar News