మెగాస్టార్‌ గేమ్‌ షో లో అల్లు అర్జున్‌ ప్రశ్న..!

ఇప్పుడు అదే గేమ్‌ షో లో అల్లు అర్జున్‌ గురించి ప్రశ్న అడగడం జరిగింది.

Update: 2024-10-18 05:07 GMT

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌ పతి సీజన్‌ 16 ప్రస్తుతం నడుస్తోంది. ఈ షోలో ఇటీవల పవన్‌ కళ్యాణ్ గురించి ప్రశ్న వచ్చిన విషయం తెల్సిందే. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన హీరో ఎవరు అనే ప్రశ్న వేయడం జరిగింది. సోషల్‌ మీడియాలో ఆ విషయమై ప్రముఖంగా చర్చ జరిగింది. బిగ్‌ బి గేమ్‌ షో లో పవన్‌ కళ్యాణ్ ప్రశ్న వేయడం జరిగిందని సోషల్‌ మీడియాతో పాటు, మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పుడు అదే గేమ్‌ షో లో అల్లు అర్జున్‌ గురించి ప్రశ్న అడగడం జరిగింది. దాంతో మరోసారి కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షో తెలుగు వార్తల్లో, తెలుగు సోషల్ మీడియాలో నిలిచింది.

ఇటీవల టెలికాస్ట్‌ అయిన ఎపిసోడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ తన ముందు హాట్‌ సీట్‌లో ఉన్న కంటెస్టెంట్‌ను 2023 నేషనల్‌ అవార్డ్స్‌ లో ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న హీరో ఎవరు అంటూ ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా అల్లు అర్జున్‌ అంటూ కంటెస్టెంట్‌ చెప్పడంతో రూ.20 వేలు గెలుచుకున్నారు. కంటెస్టెంట్‌ సమాధానం చెప్పిన తర్వాత అల్లు అర్జున్ గురించి అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ నటనను ప్రశంసించారు. గొప్ప నటుడు అంటూ అల్లు అర్జున్‌ గురించి అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని అభిమానులతో పాటు తెలుగు నెటిజన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు.

అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఉత్తమ నటన ప్రతిభ కనబర్చినందుకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మొదటి ఉత్తమ నటుడు అవార్డును జాతీయ స్థాయిలో అందుకున్న అల్లు అర్జున్‌ కి ఆయన ఫ్యాన్స్‌ నుంచే కాకుండా అందరి నుంచి ప్రశంసలు దక్కాయి. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చేస్తున్నారు. కచ్చితంగా మరోసారి పుష్ప 2 కి గాను అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు అవార్డులను దక్కించుకోవడం ఖాయం అనే విశ్వాసంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ప్రతిభను వాడేస్తున్నారు.

పుష్ప 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈనెల చివరి వరకు గుమ్మడికాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. పుష్ప తో పోల్చితే పుష్ప 2 లో అల్లు అర్జున్ పాత్ర పరిధి పది రెట్లు ఎక్కువగా ఉంటుందని, అంతే కాకుండా సినిమాలో నటన సైతం అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్‌ కు పుష్ప 2 మరోసారి పాన్ ఇండియా హిట్‌ ను ఇవ్వడం ఖాయం. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలు అంటూ చాలా వస్తున్నాయి. కానీ ఉత్తరాదిన వసూళ్లు సాధించడం లేదు. కానీ పుష్ప 2 మాత్రం అక్కడ భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. పుష్ప పార్ట్‌ 1 ప్రమోషన్‌ లేకుండానే ఉత్తరాదిన రూ.100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు రూ.250 కోట్ల టార్గెట్‌ ను నార్త్‌ ఇండియాలో పుష్ప 2 మేకర్స్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ అందించే పాటలు ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నాయి.

Tags:    

Similar News