మీ వ‌ల్లే హైద‌రాబాద్‌తో ప్రేమ‌లో ప‌డిపోయా: అన‌సూయ‌

ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటింది.

Update: 2023-12-04 03:30 GMT

ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్ దాటింది. దీంతో మంత్రి కేటీఆర్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

'వరుసగా రెండుసార్లు BRS ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు మా త‌ర‌పున‌ కృతజ్ఞతలు. నేటి ఫలితాలతో మేము బాధపడటం లేదు. కానీ అనుకోని విధంగా జరగడంతో కాస్త నిరాశ చెందాం. అయితే ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని అలవోకగా తిరిగి వస్తాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ఆల్ ది బెస్ట్' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ వెంటనే వైరల్‌గా మారింది. దీనికి యాంకర్ అనసూయ రిప్లై ఇచ్చి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించింది. ``చాలా మందికి ఆదర్శంగా నిలిచిన మీరు నిజమైన నాయకుడు సార్. అయితే ఈసారి కూడా అదే బాధ్యతతో ప్రజలు మీకు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను నెరవేర్చాలి. ప్రతి క్షణం అభివృద్ధి చేస్తూ మమ్మల్ని మళ్లీ మళ్లీ హైదరాబాద్‌తో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు`` అని అనసూయ భరద్వాజ్ రాసారు.

నెటిజన్లు భ‌గ‌భ‌గ‌ మండిపాటు:

అయితే అనసూయ వ్యాఖ్యలను ఉటంకిస్తూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ``థ్యాంక్యూ ఆంటీ, చెప్పింది చాలు, హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చేస్తే సరిపోదు ఆం*..`` అని వ్యాఖ్యానించారు. నువ్వు పెయిడ్ ఆర్టిస్టువి, అసలు నువ్వు ఓటేశావా? అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్లూ అనసూయ సరిగ్గానే మాట్లాడిందని కొందరు సపోర్ట్ చేస్తున్నారు. కేటీఆర్ అభివృద్ది ప‌థం గురించి అన‌సూయ చాలా సంద‌ర్భంలో సోష‌ల్ మీడియాల్లో ఇలానే స్పందించారు. ఇప్పుడు త‌న‌కు కొత్తేమీ కాదు. కానీ తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం నెటిజ‌నుల ట్రోలింగ్ అధిక‌మైంది.

Tags:    

Similar News