అనసూయ గ్లామర్ మాయ.. ఇలా ఎప్పుడైనా చూశారా..

యాంకరింగ్‌ నుంచి వెండితెరపైకి అడుగుపెట్టగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Update: 2024-08-24 13:13 GMT

టాలీవుడ్ బుల్లితెరపై తన ప్రత్యేకమైన శైలి, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ భరద్వాజ్, యాంకరింగ్‌ తో పాటు తన నటనతో కూడా మంచి గుర్తింపు పొందింది. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ, 'జబర్దస్త్' కామెడీ షోలో యాంకర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది.


యాంకరింగ్‌ నుంచి వెండితెరపైకి అడుగుపెట్టగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'క్షణం' సినిమాలో ఆమె పోషించిన పాత్ర విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి, తన సత్తా ఏంటో నిరూపించింది. రంగమ్మత్తగా అనసూయ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాత్ర ఆమెకు ఒక యూ టర్న్ లాంటిది.


తర్వాత ఆమె 'పుష్ప' సినిమాలో కీలక పాత్రలో నటించి, మరోసారి ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం 'పుష్ప 2'లో కూడా ఆమె పాత్ర కొనసాగుతోంది. తెలుగు సినిమాలతో పాటు ఇతర ఇండస్ట్రీ సినిమాల్లో కూడా అనసూయకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. అనసూయ తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.


తన ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ మధ్యకాలంలో అనసూయ తన గ్లామర్ ఫోటోలతో కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. లాంగ్ ఫ్రాక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్న ఆమె, నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.


ఈ ఫోటోలలో ఆమె అందం, గ్రేస్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. అనసూయ కెరీర్‌లో నటిగా ఇంకా ముందుకు వెళ్లాలని చూస్తున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం 'పుష్ప 2'తో పాటు కొన్ని ఇతర ప్రాజెక్టుల్లో కూడా నటిస్తోంది. అలాగే వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది. రాబోయే సినిమాలలో అనసూయ నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించబొతున్నట్లు ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న పాత్రలను చూస్తేనే అర్ధమవుతుంది.

Tags:    

Similar News