ధనుష్ పై 100 కోట్ల బడ్జెట్

Update: 2023-01-20 06:30 GMT
సౌత్ ఇండియా స్టార్ హీరో ధనుష్ తన కెరియర్ లో 50వ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు.  ఇండియన్ వైడ్ గా అన్ని భాషలలో సినిమాలు చేస్తూ నటుడిగా తనదైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక సార్ సినిమాతో టాలీవుడ్ లో ధనుష్ అడుగుపెడుతున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలు క్లాస్ టచ్ తో తెరకెక్కుతున్నాయి. ఇక సార్  సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో ఉన్న ధనుష్ కెప్టెన్ మిల్లర్ అనే సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో మాఫియా నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీలో ఒక గ్యాంగ్ లీడర్ గా ధనుష్ కనిపించబోతున్నాడు. ఇందులో సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇదిలా తాజాగా ధనుష్ తన 50 సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాని ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించేందుకు రెడీ అవుతూ ఉండటం విశేషం.

ఇక ఈ సినిమాతో ధనుష్ నే దర్శకత్వం వహిస్తున్నాడు. తన కెరియర్ లో మైలురాయి లాంటి 50వ సినిమాని వేరొక దర్శకుడి చేతికి ఇవ్వకుండా ధనుష్ తనలోని మేకర్ ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం విశేషం.

ఇక ఈ సినిమా కూడా పీరియాడిక్ జోనర్ లోనే తెరకెక్కుతున్నట్లు పోస్టర్ బట్టి అర్ధం అవుతుంది. ఈ పోస్టర్ లో బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్టరీల నుంచి భారీగా వెలువడుతున్న పొగ ని ఎలివేట్ చేశారు. ఆ పరిసరలాలో మురికివాడ ఉంది.

దీనిని బట్టి మురికివాడలో జరిగే కథాంశంగా ఈ మూవీ ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి వంద కోట్ల బడ్జెట్ అంటే చిన్న విషయం కాదని చెప్పాలి. మరి ఆ స్థాయి బడ్జెట్ తో ధనుష్ ఎలాంటి కథని ప్రేక్షకులకి చూపించబోతున్నాడు తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News