కాంతార చూస్తూ కన్నుమూసిన ప్రేక్షకుడు

Update: 2022-10-25 16:30 GMT
దేశవ్యాప్తంగా అందరిని ఆకర్షించిన కన్నడ సినిమా కాంతార ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రోజుకు రికార్డును క్రియేట్ చేస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగులో అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు అందుతున్నాయి. ఈ సినిమాను తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఇక పెట్టిన పెట్టుబడికి దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ఈ సినిమా మంచి లాభాలను అందిస్తుంది.

హిందీలో కూడా కలెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇక మిగతా భాషల్లో కూడా రోజురోజుకు నెంబర్లు పెరుగుతూ ఉండడంతో ఈ సినిమా కలెక్షన్స్ గురించి అనేక రకాల వార్తలో అయితే వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో ఎవరు ఊహించని విధంగా సినిమా చూస్తూ ఒక వ్యక్తి మరణించినట్లుగా వార్తలు వస్తూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్ణాటకలో ఒక వ్యక్తి సినిమా ధియేటర్లో కాంతార సినిమా చూస్తూ ఒక్కసారిగా కూర్చున్న సీటులో నుంచి కుప్పకూలి కిందపడిపోయాడు.

ఉదయం నుంచి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కర్ణాటకలోని భాగమంగళ ప్రాంతానికి చెందిన రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాంతార సినిమా చూస్తూ కూర్చున్న సీటులో నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక ఆ వ్యక్తి అలా కింద పడిపోవడంతో వెంటనే దియేటర్ యాజమాన్యం సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు.

అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు కారణంగానే అతను కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వార్త అందరిని ఆశ్చర్యాన్ని కలుగజేసింది.

ఎంతో సంతోషంగా సినిమా చూడడానికి వెళ్ళిన రాజశేఖర్ విగాత జీవిగా ఇంటికి ఒక అంబులెన్స్ లో రావడంతో కుటుంబ సభ్యులు ఎంతగానో రోదించారు. ఇక ఈ విషయంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. మరోవైపు కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల కలెక్షన్స్ ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News