ఊర్వ‌శీ రౌతేలాని బంతాడేస్తోన్న నెటి జ‌నులు!

Update: 2022-10-15 00:30 GMT
బాలీవుడ్ న‌టి ఊర్వ‌శిరౌతేలా- వికెట్ కీప‌ర్ రిష‌బ్ మ‌ధ్య వివాదం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక‌రిపై మరొక‌రు ప‌రోక్షంగా విమ‌ర్శ‌ల‌ ట్వీట్ల వ‌ర్షం కురిపించుకుంటున్నారు. తెగిపోయింద‌నుకుంటోన్న బంధాన్ని మ‌ధ్య మ‌ధ్య‌లో ఊర్వ‌శి కెలుకుతూ వార్త‌ల్లో నిలుస్తోంది. దీంతో నెటి జ‌నులంతా ఓ అంచ‌నాకి వ‌చ్చేస్తున్నారు. రిష‌బ్ రిజెక్ట్ చేస్తున్నా..ఊర్వ‌శి ప‌నిగ‌ట్టుకుని ఫాలో అవుతుందంటున్నారు.

తాజాగా మ‌రోసారి అమ్మ‌డి చ‌ర్య ఆ స‌న్నివేశాన్ని బ‌ల‌ప‌రించింది. టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌టానికి  ఇండియా ఆసీస్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అందులో పంత్ కూడా ఉన్నాడు.  ఈనేప‌థ్యంలో ఊర్వ‌శి కూడా ఆస్ర్టేలియా  వెళ్లింది. ప్లైట్ లో వెళ్తోన్న  ఓ పిక్ ని షేర్ చేసి 'నా హృద‌యాన్ని ఫాలో అవుతున్నా' అని రాసుకొచ్చింది. దీంతో రిష‌బ్ కోసం ఈ ఆరాట‌మంతా అంటూ మ‌రోసారి హాట్ టాపిక్ గా  మారింది.

అత‌ను వ‌ద్దంటోన్న దేనికీ ఆరాటం అంటూ నెటి జ‌నులు కామెంట్లు  పోస్ట్  చేస్తున్నారు. అసీస్ లో ఉన్న అమ్మ‌డు తాజాగా ఓ షార్ట్ వీడియోని షేర్ చేసింది. అందులో  చీర సింధురంతో ధ‌గ‌ధ‌గ‌లాడిపోతుంది. ఆ వీడియోని ఉద్దేశించి తొలుత ఇరాన్ లోని మ‌హ్స్ అమిని అని ..ఇప్పుడు భార‌త్ లో నా మీద వేధింపులు జ‌రుగుతున్నాయి. అంద‌రూ న‌న్ను స్టాక‌ర్ అంటున్నారు.

దాని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. నాకు మ‌ద్ద‌తుగా నిలువ‌లేదు. వేధింపులు ఆపండి. బ‌ల‌మైన స్ర్తీ అంటే గాఢంగా అనుభూతి పొంద‌డమే. ఆమె భ‌యం లేకుండా ప్రేమిస్తుంది. ఆమెకి న‌వ్వు ఎలా ఉంటుంది. క‌న్నీళ్లు ఎలా ఉంటాయి? అన్న‌ది బాగా తెలుసు. ఆమె ప్ర‌పంచానికి ఒక బ‌హుమ‌తి అని రాసుకొచ్చింది. దానికి బాధ‌ ఉన్న ఎమోజీని జోడించింది.

మ‌రో స్టోరీ లో  ఇరాన్ చ‌ట్టాల్ని అతిక్ర‌మించిన మ‌హ్సాని అరెస్ట్ చేయాల‌నుకున్నారు. అంత‌కు ముందు ఎడ్యుకేట్ చేయ‌డానికి  డిటెన్ష‌న్ సెంట‌ర్ కి తీసుకెళ్లారు. అమె అక్క‌డే చ‌నిపోయింది. పోలీసుల బ్యాట్ తో త‌ల‌పై మోద‌డంతోనే అలా జ‌రిగింది. కానీ పోలీసులు హార్ట్ ఫెయిల్యూర్ కార‌ణంగా చ‌నిపోయిందంటున్నారు. దానికి ఆమె తండ్రి స‌మాధాన్ని జోడించి..మ‌హిళ‌ల్ని టార్గెట్ చేయ‌డం ఆపాలంటూ డిమాండ్ ప‌ర్వాన్ని చెప్పుకొచ్చింది.

అలాగే మీడియా కోసం ఆసిస్ మ్యాప్ ని జోడించింది. ఇది భార‌తీయ మీడియా కోసం ఆస్ర్టేలియా ఎంత పెద్ద‌తో తెల‌సుకోవ‌డం కోసం' అని రాసుకొచ్చింది. మొత్తానికి భార‌త్ లో త‌న ప‌రిస్థితిని..ఇరాన్  లో ఆ మ‌హిళ ప‌రిస్థితి అలా ఉంద‌ని చెప్పుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది. దీనిపై ఇండియ‌న్స్ ఒక్క‌సారిగా  భ‌గ్గు మంటున్నారు.

 అర్ధం ప‌ర్ధం లేని పోస్టులు పెడుతూ భార‌త్ ప‌రువును బ‌జారుకు లాగొద్దంటూ మండిప‌డుత‌న్నారు.  ప్ర‌చారం కోసం ఇష్టానుసారం భార‌త్ ని ఉద్దేశించి కామెంట్లు చేస్తే ఇక‌పై ఊరుకునేది లేదంటూ కొంద‌రు గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. ముందు మ‌నం ఎంత స‌క్ర‌మంగా ఉన్నామో తెలుసుకుని కామెంట్లు పెట్టాలంటూ మండిప‌డుతున్నారు. ప్ర‌చారం కోసం పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే?  చూస్తూ ఊరుకోం అంటూ గ‌ట్టిగానే అందుకుంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News