#గుస‌గుస‌.. చ‌ర‌ణ్ తో ఆలియా రెండోసారీ..!

Update: 2021-05-22 00:30 GMT
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్టును నిర్మాత‌ దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. దాదాపు 400కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌న్న టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు సాగుతున్నాయి. ప‌లు భాష‌ల్లో ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో కొంద‌రు పాపుల‌ర్ స్టార్లు ఈ చిత్రంలో న‌టించ‌నున్నారు.చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే క‌థానాయిక ఎవ‌రు? అన్నదానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ నెల‌కొంది. ర‌ష్మిక మంద‌న‌.. కియ‌రా అద్వాణీ.. పూజాహెగ్డే అంటూ ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు ఇటీవ‌ల వినిపించాయి.

కానీ శంక‌ర్ ఆలోచ‌న వేరుగా ఉంద‌ని తెలిసింది. హిందీ ఫిల్మ్ సర్కిల్స్ లో గుస‌గుస‌ల ప్ర‌కారం... ట్యాలెంటెడ్ హీరోయిన్ అలియా భట్ ను శంక‌ర్ సంప్రదించారని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత‌ ఆలియా చరణ్ తో రొమాన్స్ చేయడం రెండవసారి అవుతుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో జాతీయ స్థాయి క్రేజీ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసే అరుదైన అవ‌కాశం ఆలియాను వ‌రించిన‌ట్టే. ఈ చిత్రానికి ఆలియా సంత‌కం చేశారా లేదా? అన్నదానిపై మ‌రింత క్లారిటీ రావాల్సి ఉంది. భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో గంగూభాయి క‌తియావాడీ అనే చిత్రంలోనూ ఆలియా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయాన్ ముఖ‌ర్జీ బ్రహ్మాస్త్ర‌లోనూ ఆలియా క‌థానాయిక‌.
Tags:    

Similar News