చెస్​ దిగ్గజం విశ్వనాథన్​ ఆనంద్​ బయోపిక్​ త్వరలో సెట్స్​ పైకి..

Update: 2021-02-12 07:30 GMT
చెస్​ దిగ్గజం విశ్వనాథన్​ ఆనందర్​ జీవితచరిత్ర ఆధారంగా ఓ బయోపిక్​ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్​ పనులు జరుగుతున్నాయని త్వరలో షూటింగ్​ మొదలు పెడతామని చిత్ర నిర్మాత మహావీర్​ జైన్​ చెప్పారు. అయితే ప్రస్తుతం బయోపిక్​ల ట్రెండ్​ నడుస్తోంది. ఒక్క బాలీవుడ్​లోకాక.. ప్రాంతీయ భాషల్లో సైతం బయోపిక్​లు తెరకెక్కించేందుకు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదిలా ఉంటే దిగ్గజ  చెస్​ ప్లేయర్​, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత విశ్వనాథన్ ఆనంద్​ జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని తీయబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో విశ్వనాథన్​ ఆనంద్​ పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే చిత్ర నిర్మాత మహావీర్​ జైన్​ మాట్లాడుతూ.. టైటిల్​ రోల్​కు అమీర్​ఖాన్​ అయితే సెట్​ అవుతాడని తన అభిప్రాయమని చెప్పారు. ఇప్పుడీ విషయం హాట్​టాపిక్​గా మారింది.  ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘ప్రస్తుతం ఈ చిత్రం స్టోరీపై వర్క్​ చేస్తన్నాం. స్క్రిప్ట్​ రెడీ చేసుకుంటున్నాం. నటీనటులు ఎవరన్న విషయం ఇంకా నిర్ణయించలేదు. అయితే అమీర్​ఖాన్​ బాగుంటాడన్నది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంపై ఇంకా చర్చలు జరగలేదు’ అని ఆయన చెప్పారు.

మరోవైపు బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు.  అమీర్​ఖాన్​ గతంలో ‘దంగల్’ సినిమాలోని మహావీర్ సింగ్ ఫొగాట్‏గా నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
Tags:    

Similar News