గోదారి అందాలతో పాప క్లీన్ బౌల్డ్

Update: 2017-02-03 07:20 GMT
విశాఖలో పుట్టిన వయ్యారి అనీషా ఆంబ్రోస్.. ఒరిస్సాలో పెరిగి ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీగా ఎదిగింది. ఇంకా కెరీర్ లో సరైన బ్రేక్ రాలేదు కానీ.. ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తూనే ఉంది. గతేడాది రన్.. మనమంతా చిత్రాల్లో కనిపించినా.. అంతకుముందు పవన్ కళ్యాణ్ మూవీ గోపాలాగోపాలా మూవీలో కేమియో చేసినా అంతగా కలిసిరాలేదు. కానీ ఇప్పుడు లేడీస్ టైలర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ పై అమ్మడు చాలానే ఆశలు పెట్టుకుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతోంది. సీనియర్ దర్శకుడు వంశీ చిత్రాలంటే.. విజువల్స్ కి ప్రకృతి అందాలకు ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో తెలిసిందే. ఇప్పుడు ఆ అందాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం రావడంతో.. అనీషా తెగ  సంబరపడిపోతోంది. 'నేను లేడీస్ టైలర్2 చిత్రాన్ని చేస్తుండడం చాలా గర్వంగా భావిస్తున్నాను. వంశీ గారి కళ్ల ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని అద్భుతమైన అందాలను చూస్తున్నాను' అంటూ తన ఐఫోన్ ద్వారానే క్లిక్ మనిపించిన ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంది అనీషా ఆంబ్రోస్. మొత్తానికి గోదారి అందాలతో అమ్మడు క్లీన్ బౌల్డ్ అయిపోయినట్లుంది.

విశాఖలో పుట్టిన బ్యూటీకి.. పక్కనే ఉన్న తూర్పు గోదావరి జిల్లా అందాలు తెలియదంటే కొంచెం ఆశ్చర్యం వేసే విషయమే. అయితే.. ఫ్యాషన్ డిజైనర్ మూవీ విషయంలో ఎప్పుడు అప్ డేట్ వచ్చినా.. అందరూ ప్రకృతి అందాల గురించే మాట్లాడుకుంటున్నారు. చూస్తుంటే.. మరోసారి ప్రకృతిలోని సహజమైన అందాలతో.. వంశీ మరోసారి మైమరిపించేట్లుగానే ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News