ప్రముఖ నటుడిపై మర్డర్‌ కేసు నమోదు

Update: 2019-05-11 06:26 GMT
కోలీవుడ్‌ కు చెందిన ప్రముఖ నటుడు పత్రిభన్‌ మర్డర్‌ కేసులో చిక్కుకున్నాడు. ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన ఈయన తెలుగులో కూడా ఒకటి రెండు చిత్రాల్లో నటించాడు. తమిళంలో స్టార్‌ హీరోల సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈయన హత్య కేసుతో వార్తల్లోకి రావడం ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశం అవుతోంది. చెన్నైలో ఈయనపై జయరామ్‌ అనే వ్యక్తి హత్య యత్నం కేసును పెట్టడం జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం పత్రిభన్‌ ను పోలీసులు విచారిస్తున్నారు.

గత పదేళ్లుగా పత్రిభన్‌ వద్ద జయరామ్‌ వర్క్‌ చేస్తూ ఉన్నాడు. తాజాగా పత్రిభన్‌ ఇంట్లో దొంగతనం జరిగింది. దాంతో పత్రిభన్‌ కొందరిపై సీరియస్‌ అయ్యాడు. ఆ సమయంలోనే జయరామ్‌ ను కొట్టాడట. దాంతో అతడు మూడవ ఫ్లోర్‌ పై నుండి పడ్డాడట. ఈ ప్రమాదంలో అతడికి గాయాలయ్యాయట. పోలీసులకు జయరామ్‌ తనపై జరిగిన హత్య ప్రయత్నం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ విషయంలో పత్రిభన్‌ స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదు అని చెబుతున్నాడు. తనను కావాలని ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Tags:    

Similar News