రేపిస్ట్‌ ను ప్రోత్సహిస్తున్నారంటూ స్టార్‌ హీరోపై విమర్శలు

Update: 2019-04-17 12:55 GMT
మీటూ వివాదం మెల్ల మెల్లగా చల్లారుతుందని భావిస్తున్న తరుణంలో ఎవరో ఒకరు దాన్ని తట్టి లేపినట్లుగా ఏదో ఒక వ్యాఖ్య చేయడం మళ్లీ మీటూ గురించి చర్చ మొదలవ్వడం గత కొన్ని నెలలుగా జరుగుతోంది. మీటూ వల్ల ఎంతో మంది ప్రముఖుల పరువు రోడ్డున పడింది. కొందరు సినిమాలకు దూరం అవ్వగా, కొందరు ఇండస్ట్రీనే వదిలేసి వెళ్లి పోవాల్సి వచ్చింది. మీటూ వేడి తగ్గిన నేపథ్యంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వారు కొందరు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. లైంగిక వేదింపులు ఎదుర్కొన్న నటుడు అలోక్‌ నాథ్‌ ను తాజాగా అజయ్‌ దేవగన్‌ తన 'దే దే ప్యార్‌ దే' అనే చిత్రంలోకి తీసుకోవడం జరిగింది.

వింటానందా గత ఏడాది అలోక్‌ నాధ్‌ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను అలోక్‌ నాధ్‌ రేప్‌ చేశాడని, కొన్ని సంవత్సరాల క్రితం అతడు తనను లైంగికంగా వేదించాడంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పింది. అయితే ఆ వ్యాఖ్యలు అసత్యం అంటూ అలోక్‌ నాధ్‌ వాధిస్తూ వస్తున్నారు. ఈ వివాదం ఇలా ఉండగానే అలోక్‌ నాధ్‌ ను అజయ్‌ దేవగన్‌ సినిమాల్లోకి తీసుకోవడంను ఇండియాలో మీటూ ఉద్యమంకు ఆజ్యం పోసిన నటి తనూశ్రీ దత్తా తప్పుబడుతోంది.

అలోక్‌ నాధ్‌ ఒక రేపిస్ట్‌ అంటూ వింటానందా గారు పదే పదే చెబుతున్నారు. ఆ విషయం అబద్దం కాదని నిరూపితం అవ్వలేదు. అలోక్‌ నాద్‌ ప్రస్తుతం నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. రేపిస్ట్‌ గా నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తికి మీ సినిమాలో ఛాన్స్‌ ఇవ్వడం వల్ల మీరు రేపిస్ట్‌ లను ప్రోత్సహిస్తున్నట్లుగా అవుతుందంటూ అజయ్‌ దేవగన్‌ పై తీవ్ర స్థాయిలో తనూ శ్రీ దత్తా వ్యాఖ్యలు చేసింది. మీరు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించడం లేదు అంటూ అజయ్‌ దేవగన్‌ పై తనూ శ్రీదత్తా విరుచుకు పడింది. కేసును ఎదుర్కొంటున్న అలోక్‌ నాధ్‌ ఇంకా దోషిగా తేలలేదు కనుక అజయ్‌ దేవగన్‌ ఆయన్ను తన సినిమాలో నటింపజేస్తూ ఉంటాడని కొందరు అంటున్నారు. ఈ విషయాన్ని మరీ రాద్దాంతం చేయాల్సిన పని లేదంటూ కొందరు తనూ శ్రీ దత్తాకు సూచిస్తున్నారు.

Tags:    

Similar News