సామ్‌ చైతూ గొడవ పడలేదు.. మరి ఎందుకు విడిపోయారు?

Update: 2022-07-21 03:30 GMT
నాగచైతన్య మరియు సమంత ల యొక్క దాంపత్యం కొన్నాళ్లే సాగినా కూడా చాలా మంది చాలా రకాలుగా వారి యొక్క అన్యోన్యత గురించి మాట్లాడుకునే వారు. కలకాలం వీరి దాంపత్యం ఇలాగే ఆనందంగా సాగాలని అంతా కోరుకునే వారు. కానీ ఏం జరిగిందో ఏమో కాని సామ్ మరియు నాగ చైతన్య లు అనూహ్యంగా విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించి షాక్ ఇచ్చారు.

వీరి విడాకుల ప్రస్తావన వచ్చిన సమయంలో చాలా మంది పుకార్లు అనుకున్నారు. కాని వారే స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో నమ్మక తప్పలేదు. ఇద్దరు ఉన్న అన్యోన్యతకు ఏ ఒక్కరు కూడా విడాకుల వార్తలను జీర్ణించుకోలేక పోయారు. సీనియర్ నటుడు మురళీ మోహన్ కూడా ఆ వార్తలను నమ్మలేక పోయాను అన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.

మురళి మోహన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...  మేము ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు ను నాగ చైతన్య సమంత కోసం అంటూ నాగార్జున అడిగినందుకు ఇచ్చేశాను. ఆ ఇంట్లో నాగచైతన్య మరియు సమంత లు ఉండే వారు. వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. ఎప్పుడు చూసినా కలిసి జిమ్‌ చేసే వారు.. చాలా సంతోషంగా కనిపించే వారు.

వారి మధ్య ఎప్పుడు కూడా గొడవ జరిగినట్లు అనిపించ లేదు. అసలు వారు గొడవ పడ్డట్లుగా పక్క ఇంట్లో ఉండే మాకు తెలియనే లేదు. వారిద్దరు విడిపోయారు అని తెలిసి షాక్‌ అయ్యాను. నేను మాత్రమే కాకుండా మా ఫ్యామిలీ కూడా షాక్ అయ్యారు.. విడాకుల విషయం మాకు ఆలస్యంగా తెలిసిందని మురళి మోహన్‌ పేర్కొన్నారు.

గొడవలు లేకుంటే ఎలా విడిపోయారు.. ఎందుకు విడిపోయారు అంటూ నాగచైతన్య మరియు సమంత అభిమానులు మురళి మోహన్ ను ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు మాత్రం ఇద్దరి మద్య పెద్ద గొడవ ఏమీ లేదేమో.. చిన్న విషయానికి వెంటనే విడిపోయేంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నారేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా ఇద్దరు విడిపోవడం ఏ ఒక్కరికి ఇష్టం లేదు. కాని వారి ఇష్టానుసారంగా విడి పోయి సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా వారి నిర్ణయాన్ని గౌరవించి వారి యొక్క వ్యక్తిగత విషయాలను రాద్దాంతం చేయకుండా వదిలేస్తే బాగుంటుంది అనేది అక్కినేని ఫ్యామిలీ యొక్క సన్నిహితుల మరియు అభిమానుల అభిప్రాయం.
Tags:    

Similar News