చెర్రీ-సామ్! లిప్ లాక్ తో అలా చీట్ చేశారు!

Update: 2022-04-01 05:33 GMT
ముద్దు సీన్ లో న‌టించడం అంటే అంత‌ వీజీ కాదు. సెట్లో వంద మంది ముందు స‌న్నివేశం తెర‌కెక్కిస్తుంటే ముద్దు పెట్టుకునే హీరోకు.. పెట్టించుకునే హీరోయిన్ కి బోలెడంత ఒణుకు పుడుతుంది. అయితే కొంద‌రు చాలా సునాయాసంగా చేసేస్తుంటారు కానీ చాలామందికి ఇది క‌ష్ట‌త‌ర‌మైన‌ది. మొహ‌మాటం బిడియం అనేవి ఇలాంటి సంద‌ర్భాల్లో బ‌య‌ట‌పడుతుంటాయి.

ఇలాంటి స‌మ‌స్యనే ఎదుర్కొన్నాడు రామ్ చ‌ర‌ణ్‌. ఇంత‌కుముందు రంగ‌స్థ‌లం చిత్రంలో స‌మంత‌తో లిప్ లాక్ సీన్ ర‌హ‌స్యాన్ని సుకుమార్ బ‌య‌ట‌పెట్టాడు. నిజానికి రామ‌ల‌క్ష్మి (స‌మంత‌)తో సిట్టిబాబు (చ‌ర‌ణ్‌) లిప్ లాక్ వేయాలి. అది మూవీలో కీల‌క‌మైన సీన్. అందువ‌ల్ల త‌ప్ప‌దు. కానీ చ‌ర‌ణ్ దానికి స‌సేమిరా అన్నాడ‌ట‌. ఉపాస‌న ఒప్పుకోదు వ‌ద్దు ప్లీజ్! అనేశాడ‌ట‌. త‌న‌కు ఇలాంటివి న‌చ్చ‌వ‌ని కూడా సుక్కూకి చెప్పేశాడు.

కానీ ఆ సీన్ కోసం సుక్కూ ఓ ప్లాన్ వేశాడు. స‌మంత‌తో సీక్రెట్ గా ఒక మాట చెప్పాడు. స‌న్నివేశం తెర‌కెక్కించేప్పుడు మ్యానేజ్ చేయాల‌ని అనుకుంటున్నాం. కానీ నువ్వే చ‌ర‌ణ్ పెద‌వుల‌పై ముద్దు పెట్టేయ్! అన్నాడ‌ట‌. దాంతో ఆ సీన్ లో సమంత కాస్త చొర‌వ‌గా చ‌ర‌ణ్ ని ముద్దాడేసింద‌ట‌. దీంతో స‌న్నివేశం అద్భుతంగా పండింది. అయితే సామ్ అలా చేసినందుకు త‌న‌పైనా సుకుమార్ పైనా చ‌ర‌ణ్ సీరియ‌స్ అయ్యార‌ట‌. ఇలా చేశారేంటి? అంటూ ..!  కానీ ఆ త‌ర్వాత సుకుమార్ దానికి స‌ర్ధి చెప్ప‌డంతో అంతా శాంతించారు.

మొత్తానికి ఆ లిప్ లాక్ సీన్ విష‌యంలో చ‌ర‌ణ్ ని సామ్ చీట్ చేసినా బాగా కుదిరింది. ఇక‌పోతే ఆడియెన్ ని చీట్ చేయ‌డం కోసం సుక్కూ ఇంకో ప్లాన్ కూడా వేశాడు. చ‌ర‌ణ్ స‌సేమిరా అంటే ఆ సీన్ ని ఏదోలా మ్యానేజ్ చేయాలి కాబ‌ట్టి టెక్నిక‌ల్ గా చాలా ఆలోచించాడ‌ట‌. గ్రాఫిక్స్ లో మ్యానేజ్ చేసేద్దామ‌ని కూడా అనుకున్నాడ‌ట‌. కానీ స‌హ‌జంగానే అది అలా కుదిరేసింది. అప్పటికే పెళ్ల‌యిన చ‌రణ్‌ ఉపాసనకు లిప్ లాక్ సీన్లు నచ్చవని చెప్పినా కానీ సుకుమార్ కావాల‌నే ఆ సీన్ ని జాయింట్ చేశాడ‌ని అనుకోవ‌చ్చు.

మెగాపవర్ స్టార్  రామ్‌చరణ్- స‌మంత జంట‌గా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రంగ‌స్థ‌లం  కి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బిగ్గెస్ట్ మ్యూజిక‌ల్ హిట్ గా నిలిచింది.  చరణ్- సమంతల నటనతో పాటు లిప్ లాక్ సీన్ కి పేరొచ్చింది. మ‌గ‌ధీర త‌ర్వాత చ‌ర‌ణ్ అంతే సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితం రంగ‌స్థ‌లంతో అందుకున్నాడు.

అంత‌కుముందు ధృవ చిత్రం చ‌క్క‌ని విజ‌యం సాధించింది. ఇక రంగ‌స్థ‌లంలో రంగమ్మ‌త్త‌గా అన‌సూయ‌కు.. విల‌న్ గా న‌టించిన జ‌గ‌ప‌తిబాబుకు కూడా మంచి పేరొచ్చింది. దాదాపు 90కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 209 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. ఈ సినిమా రిలీజై నాలుగేళ్ల‌య్యింది.
Tags:    

Similar News