వాళ్లు మంచి వారు కాదు.. చిన్మయికి మళ్లీ కోపం వచ్చింది..!

Update: 2022-12-25 06:40 GMT
చిన్మయి శ్రీపాద ఒక సింగర్ అని చెప్పడం కన్నా ఎక్కడ మహిళల గురించి తప్పుగా మాట్లాడుతారో.. ఎక్కడ మహిళల మీద అబ్యూజింగ్ కామెంట్స్ చేస్తారో అక్కడ ప్రత్యక్షమవుతుందని చెప్పొచ్చు. మీటూ మూమెంట్ నుంచి ఆమె ఒక రెబల్ గా మారింది. ఏదైనా ఇష్యూలోకి చిన్మయి ఎంట్రీ ఇచ్చింది అంటే ఆ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లోకి వెళ్లినట్టే. లేటెస్ట్ గా చిన్మయి శ్రీపాద నయనతార మీద నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్ మీద ఫైర్ అయ్యింది.

విఘ్నేశ్ శివన్ తో పెళ్లి తర్వాత నయనతార లేటెస్ట్ గా కనెక్ట్ సినిమా కోసం బయటకు వచ్చింది. ఆ సినిమా రిలీజ్ టైం లో అభిమానులతో ముచ్చటించింది. ఆ టైం లో ఆమెను టార్గెట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వెంటనే రంగంలోకి దిగిన చిన్మయి రివర్స్ ఎటాక్ చేసింది. మహిళలంతా ఇలాంటి పురుషులకు తమ పిల్లలని దూరంగా ఉంచాలని అన్నారు. వారు అంత మంచి మనుషులు కారని.. వారి వల్ల ఆడపిల్లలకు ఎలాంటి రక్షణ లేదని చిన్మయి కామెంట్ చేశారు.

హీరోయిన్స్ ఫోటో షూట్ లోనో.. ఇంటర్వ్యూస్ లోనో వారు వేసుకున్న డ్రెస్ మీద ట్రోల్స్ రావడం చాలా కామన్. అయితే పనిగట్టుకుని ఎవరు ఇలా చేయాలని అనుకోరు. కానీ చిన్మయి మాత్రం నయనతారని కావాలని టార్గెట్ చేస్తున్నారని భావించి ఆమెకు సపోర్ట్ గా రివర్స్ కామెంట్స్ చేస్తుంది. అయితే చిన్మయి కామెంట్స్ ఒకప్పుడు అందరు పట్టుకునే వారు కానీ ఇప్పుడు ఆమెని కూడా లైట్ తీసుకున్నారు నెటిజన్లు.

తనపై వచ్చిన కామెంట్స్ ని నయనతారే చాలా లైట్ తీసుకోగా చిన్మయి మాత్రం ఈ మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంది. ఇక కనెక్ట్ సినిమా విషయానికి వస్తే అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను విఘ్నేశ్ శివన్ నిర్మించారు. 99 నిమిషాల ప్రయోగాత్మక రన్ టైం తో వచ్చిన ఈ సినిమా తమిళంలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తెలుగులో మాత్రం నిరాశపరచిందని తెలుస్తుంది.
Tags:    

Similar News