బ్రేకప్ అయ్యిందా ఏంటి?

Update: 2018-02-28 17:30 GMT
బాలీవుడ్ లో రూమర్స్ కి ఉన్నంత క్రేజ్ ఇంకెక్కడా ఉండదేమో. ఎన్ని ఊహాగానాలు వచ్చినా కూడా వాటికి ఎండ్ కార్డ్ అంత ఈజీగా పడదు. సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న కొద్దీ వివిధ కోణాల్లో రూమర్స్ రచ్చ చాలా పెరిగిపోయింది. సెలబ్రెటీలు కూడా వాటిని పెద్దగా పట్టించుకోకపోవడంతో ఏ మాత్రం ఆగడం లేదు. ఇక అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ లో గత రెండేళ్లుగా ఓ జంటపై అనేక రూమర్స్ వస్తున్నాయి. వారిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు అని నార్త్ మిడియలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.

ఇద్దరు ప్రేమ పక్షుల్లా విహరిస్తుండడంతో అందరు అదే అనుకుంటున్నారు. వారెవరో కాదు. దిశా పటాని - టైగర్ ష్రాఫ్. ఈ జంట ఏ పార్టీకి వెళ్లినా అలాగే వేడుకలకు వెళ్లినా కూడా కలిసి వెళతారు. దిశా కి ఈ మధ్య ఆఫర్స్ ఎక్కువగా రాలేదు. కానీ టైగర్ తన భాగీ సినిమాలో హీరోయిన్ గా రికమాండ్ చేశాడు. ఆ సినిమాకు క్రేజ్ పెరుగుతోంది అంటే వీరిద్దరి ప్రేమ వల్లే అని తెలుస్తోంది. అయితే ఈ మధ్య వారిద్దరి మధ్య దూరం పెరిగింది అని ఓ లెవెల్లో వార్తలు వస్తున్నాయి.

భాగీ దర్శకుడు అహ్మద్ ఖాన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు తగ్గట్టుగా ఒక ఆన్సర్ కూడా ఇచ్చాడు. వారిద్దరూ సపరేట్ కార్లలో వస్తున్నారు అని కేవలం సీన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారు అనే తరహాలో వివరణ ఇవ్వడంతో బ్రేకప్ అయ్యిందా అని మరో కొత్త రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. గత కొంత కాలంగా ఇద్దరు ఎంతో క్లోజ్ గా ఉన్నారు. సడన్ గా ఇలా ఎందుకు జరిగింది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక భాగీ 2 ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
Tags:    

Similar News