నిర్మాత సైడ్ అయ్యాడా??

Update: 2017-02-22 07:38 GMT
ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లతో మెప్పించి ప్రస్తుతం గిరాకీ లేకుండా ఉన్న యాంగ్రీ యంగ్ మేన్ డా.రాజశేఖర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న పీఎస్వీ గ‌రుడు వేగ 126.18ఎం మూవీ పెద్ద బ్రేక్ పడినట్లు టాక్. ఈ సినిమా చిత్రీకరణ జోరుగా సాగుతున్న దశలో నిర్మాత హ్యాండ్సప్ కావడంతో సినిమా డోలాయమానంలో పడిందని తెలుస్తోంది. బడ్జెట్ అంచనాలకు మించిపోవడంతో నిర్మాత ఈ ప్రాజెక్టును అర్ధాంతరంగా వదిలేశాడని రూమర్లు వినిపిస్తున్నాయి.  దీంతో రాజశేఖర్ భార్య జీవితయే ఈ సినిమాను కొనసాగించేందుకు డిసైడయ్యారని సమాచారం.
    
సినిమా సెట్సుపైకి వెళ్లినప్పటి నుంచి కంటిన్యూస్ గానే షూటింగ్ చేశారు. అయితే.. బడ్జెట్ ఇప్పటికే రూ.6.5 కోట్లు దాటేసిందట.  దీంతో రాజశేఖర్ కు ఉన్న మార్కెట్ బట్టి అంతకంటే ఎక్కువ పెడితే దెబ్బయిపోతామని నిర్మాత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.  ఇటీవల బ్యాంకాక్‌ లో యాక్ష‌న్ ఎపిసోడ్ లు షూట్ చేశారు.  ఫిబ్ర‌వ‌రి 15వ‌ర‌కు బ్యాంకాక్‌ లో షెడ్యూల్ ఉంది. కానీ.. ఇంతలోనే దీనికి బ్రేకు పడింది. ఇంక మిగిలిన ఉన్న పార్టంతా ఫారెన్ లొకేషన్సులో ప్లాన్ చేసిందే కావడంతో బడ్జెట్ ఇంకా పెరుగుతుందని నిర్మాత సైడయిపోయినట్లు చెబుతున్నారు.
    
చంద‌మామ క‌థ‌లు - గుంటూరు టాకీస్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్ ఈ సినిమాకు దర్శకుడు.  శివాని శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో జ్యో స్టార్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై ఈ సినిమా తీస్తున్నారు. రాజశేఖర్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకోవడంతో జీవిత ఇప్పుడు రంగంలోకి దిగి సినిమా పూర్తి చేయడానికి ప్లాను గీస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News