క్షణం రీమేక్ సూపర్ అంటున్నారు

Update: 2017-12-08 05:43 GMT
ఓ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడం కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో.. యాక్టర్స్ బేస్డ్ గా సాగిన చిత్రాలను రీమేక్ చేయడం ఎప్పుడూ రిస్క్ గానే ఉంటుంది. ఇలాంటి వాటిలో క్షణం మూవీని రీమేక్ చేయడం కూడా చేర్చారు ఇండస్ట్రీ జనాలు.

అయితే.. సత్యరాజ్ కుమారుడు శిబి సత్యరాజ్ హీరోగా క్షణం రీమేక్ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రీమేక్  చేయాలంటూ.. సత్యరాజ్ కు ప్రభాస్ సలహా ఇచ్చాడు. ఇవాళే రిలీజ్ కానున్న ఈ మూవీని ఇప్పటికే స్పెషల్ స్క్రీనింగ్ కూడా చేశారు. మీడియా పర్సన్స్ తో పాటు పలువురు ప్రముఖులు క్షణం రీమేక్ సత్య మూవీపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. శిబి సత్యరాజ్ తో పాటు.. వరలక్ష్మీ శరత్ కుమార్.. రెమ్య నంబీసన్ లు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. మూవీ స్టోరీతో పాటు.. స్క్రీన్ ప్లే.. జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

ఒరిజినల్ క్షణం మూవీని ఏ మాత్రం చెడగొట్టకుండా రీమేక్ చేసిన తీరును అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒరిజినల్ ఫ్లేవర్ ను చెడగొట్టకుండా.. దాని ఖ్యాతిని మరింతగా పెంచేలా.. దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించిన తీరును పొగుడుతున్నారు. ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు వచ్చేయడంతో.. ఇక జనాల తీర్పు కోసం ఎదురుచూస్తోంది సత్య టీం.


Tags:    

Similar News