రాజ్ కుంద్రా బెయిల్ తర్వాత మొదటిసారి బహిరంగంగా కనిపించాడు; హిమాచల్ ప్రదేశ్ లోని ఆలయ సందర్శన కోసం శిల్పాశెట్టితో కలిసి ఆలయ ప్రాంగణంలో నడక దారిలో కనిపించారు. ఆలయ సందర్శన కోసం శిల్పాశెట్టి సహా కవలలు కూడా విచ్చేశారు. సెప్టెంబర్ లో బెయిల్ పై విడుదలైన తర్వాత రాజ్ కుంద్రా మొదటిసారిగా బహిరంగంగా కనిపించడం ఇదే. వ్యాపారవేత్త అతని కుటుంబం విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరారు.
ఇన్నాళ్టికి రాజ్ భార్య శిల్పాశెట్టితో కలిసి ఒక ఆలయాన్ని సందర్శిస్తున్న దృశ్యం బయటికి వచ్చింది. ఆధ్యాత్మిక విహారయాత్రలో భాగంగా ఇద్దరూ పసుపు రంగు దుస్తులను ధరించారు. నీలి చిత్రాల యాప్ ల కేసులో అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా బయటికి వచ్చిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
గత నెలలో రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ప్రొఫైల్ లను తొలగించిన సంగతి తెలిసినదే. ఇన్ స్టాగ్రామ్ -ట్విట్టర్ వినియోగదారు కం వ్యాపారవేత్త అయిన రాజ్ తన ఖాతాలన్నింటినీ తీసివేయాలని నిర్ణయించుకోవడం సంచలనమైంది. కానీ ఆయన సతీమణి శిల్పాశెట్టి ఫిట్ నెస్ వీడియోలు కుటుంబ చిత్రాలతో ఇన్ స్టాగ్రామ్ లో తన అనుచరులను ఆకర్షిస్తూనే ఉంది.
రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి మరియు పంపిణీ కేసులో విచారణకు సంబంధించి జూలైలో అరెస్టయ్యాడు. ముంబైలోని ఆయన కార్యాలయాలపై ముంబై పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 21న రాజ్ జైలు నుంచి బయటకు వచ్చాడు. పోలీసులు 1500 పేజీల అనుబంధ ఛార్జిషీట్ లో ఈ కేసులో కుంద్రా ``ప్రధాన సహాయకుడు`` అని పేర్కొన్నారు. అతను ఇతర నిందితులతో కలిసి సినీ పరిశ్రమలో అవకాశాల కోసం పోరాడుతున్న యువతులను అసభ్యకరమైన మార్గాల్లో చిత్రీకరించి వాటిని యాప్ ల పేరుతో మార్కెటింగ్ చేసి దోపిడీకి పాల్పడ్డాడు. అయితే ఈ ఆరోపణల్ని రాజ్ కుంద్రా ఖండిస్తున్నారు. ఈ కేసులో తనను బలిపశువుగా మారుస్తున్నారని.. మొత్తం అనుబంధ ఛార్జిషీట్ లో తనపై ఒక్క ఆరోపణ కూడా లేదని రాజ్ కుంద్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు.
రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత శిల్పాశెట్టి ఒక ప్రకటనలో ఏమన్నారంటే.. నేను ఇంకా వ్యాఖ్యానించలేదు. ఈ కేసును ఉపేక్షిస్తున్నందున అలా చేయను. కాబట్టి దయచేసి తప్పుడు కొటేషన్లను రాజ్ పై ఆపాదించడం ఆపండి. నా తత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. “ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు.. ఎప్పుడూ వివరించవద్దు” అని మీడియాని కోరింది శిల్పా. నేను చెప్పేది ఒక్కటే.. ఇది కొనసాగుతున్న విచారణ కాబట్టి నాకు ముంబై పోలీసులు అలాగే భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒక కుటుంబంగా మేము అందుబాటులో ఉన్న అన్నింటిని ఆశ్రయిస్తున్నాము. చట్టపరమైన పరిష్కారాలు వెతుకుతున్నాం.
కానీ అప్పటి వరకు నా పిల్లల కోసం మా గోప్యతను గౌరవించవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రత్యేకించి ఒక తల్లిగా కోరుతున్నాను నిజానిజాలను ధృవీకరించకుండా సగం వండిన సమాచారంపై వ్యాఖ్యానించడం మానుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు .. నేను ఎవరినీ ఎప్పుడూ నిరాశపరచలేదు. కాబట్టి ముఖ్యంగా నా కుటుంబ గోప్యతపై నా హక్కును గౌరవించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. అని అన్నారు.
ఇన్నాళ్టికి రాజ్ భార్య శిల్పాశెట్టితో కలిసి ఒక ఆలయాన్ని సందర్శిస్తున్న దృశ్యం బయటికి వచ్చింది. ఆధ్యాత్మిక విహారయాత్రలో భాగంగా ఇద్దరూ పసుపు రంగు దుస్తులను ధరించారు. నీలి చిత్రాల యాప్ ల కేసులో అరెస్ట్ తర్వాత రాజ్ కుంద్రా మొదటిసారి బహిరంగంగా బయటికి వచ్చిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
గత నెలలో రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ప్రొఫైల్ లను తొలగించిన సంగతి తెలిసినదే. ఇన్ స్టాగ్రామ్ -ట్విట్టర్ వినియోగదారు కం వ్యాపారవేత్త అయిన రాజ్ తన ఖాతాలన్నింటినీ తీసివేయాలని నిర్ణయించుకోవడం సంచలనమైంది. కానీ ఆయన సతీమణి శిల్పాశెట్టి ఫిట్ నెస్ వీడియోలు కుటుంబ చిత్రాలతో ఇన్ స్టాగ్రామ్ లో తన అనుచరులను ఆకర్షిస్తూనే ఉంది.
రాజ్ కుంద్రా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి మరియు పంపిణీ కేసులో విచారణకు సంబంధించి జూలైలో అరెస్టయ్యాడు. ముంబైలోని ఆయన కార్యాలయాలపై ముంబై పోలీసులు దాడులు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత సెప్టెంబర్ 21న రాజ్ జైలు నుంచి బయటకు వచ్చాడు. పోలీసులు 1500 పేజీల అనుబంధ ఛార్జిషీట్ లో ఈ కేసులో కుంద్రా ``ప్రధాన సహాయకుడు`` అని పేర్కొన్నారు. అతను ఇతర నిందితులతో కలిసి సినీ పరిశ్రమలో అవకాశాల కోసం పోరాడుతున్న యువతులను అసభ్యకరమైన మార్గాల్లో చిత్రీకరించి వాటిని యాప్ ల పేరుతో మార్కెటింగ్ చేసి దోపిడీకి పాల్పడ్డాడు. అయితే ఈ ఆరోపణల్ని రాజ్ కుంద్రా ఖండిస్తున్నారు. ఈ కేసులో తనను బలిపశువుగా మారుస్తున్నారని.. మొత్తం అనుబంధ ఛార్జిషీట్ లో తనపై ఒక్క ఆరోపణ కూడా లేదని రాజ్ కుంద్రా తన పిటిషన్ లో పేర్కొన్నారు.
రాజ్ కుంద్రా అరెస్టు తర్వాత శిల్పాశెట్టి ఒక ప్రకటనలో ఏమన్నారంటే.. నేను ఇంకా వ్యాఖ్యానించలేదు. ఈ కేసును ఉపేక్షిస్తున్నందున అలా చేయను. కాబట్టి దయచేసి తప్పుడు కొటేషన్లను రాజ్ పై ఆపాదించడం ఆపండి. నా తత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. “ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు.. ఎప్పుడూ వివరించవద్దు” అని మీడియాని కోరింది శిల్పా. నేను చెప్పేది ఒక్కటే.. ఇది కొనసాగుతున్న విచారణ కాబట్టి నాకు ముంబై పోలీసులు అలాగే భారత న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒక కుటుంబంగా మేము అందుబాటులో ఉన్న అన్నింటిని ఆశ్రయిస్తున్నాము. చట్టపరమైన పరిష్కారాలు వెతుకుతున్నాం.
కానీ అప్పటి వరకు నా పిల్లల కోసం మా గోప్యతను గౌరవించవలసిందిగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రత్యేకించి ఒక తల్లిగా కోరుతున్నాను నిజానిజాలను ధృవీకరించకుండా సగం వండిన సమాచారంపై వ్యాఖ్యానించడం మానుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు .. నేను ఎవరినీ ఎప్పుడూ నిరాశపరచలేదు. కాబట్టి ముఖ్యంగా నా కుటుంబ గోప్యతపై నా హక్కును గౌరవించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.. అని అన్నారు.