వైరల్‌ : విక్రమాధిత్య.. ప్రేరణల మద్య టీఎస్ ఆర్టీసీ చర్చ

Update: 2022-03-11 05:26 GMT
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రభాస్ మరియు పూజ హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్‌ కు సంబంధించిన చర్చ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కి మిశ్రమ స్పందన దక్కించుకుంది. టాక్ విషయం అలా ఉంచితే ఈ సినిమా పోస్టర్స్ తో మరియు స్టిల్స్ తో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పబ్లిసిటీ నిర్వహించే ప్రయత్నం చేశారు.

అందుకోసం ఆయన షేర్‌ చేసిన ఈ మీమ్ ప్రస్తుతం సోషల్‌ మీడియా లో వైరల్ అవుతుంది. సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందు షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. హీరో హీరోయిన్ అయిన విక్రమాదిత్య మరియు ప్రేరణలు మాట్లాడుకుంటున్నట్లుగా.. ఈ మీమ్‌ క్రియేట్ చేశారు. చాలా రోజులైంది కదా ఎక్కడికైనా వెళ్దామా అంటూ హీరో ప్రశ్నించగా.. వెళ్దాం కానీ బస్సులోనే వెళ్దాం అంటూ హీరోయిన్ సమాధానం చెబుతుంది.

ఎందుకు బస్సులోనే అంటూ హీరో ప్రశ్నించగా ఎందుకంటే ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం మరియు సుఖమయం అంటూ హీరోయిన్ సమాధానం చెప్తుంది. మొత్తంగా బస్సే క్షేమం అంటున్న రాధేశ్యాం అంటూ చివర్లో క్యాప్షన్ పెట్టి పబ్లిసిటీ చేశారు. గత కొన్నాళ్లుగా తెలంగాణ ఆర్టీసీ ని అభివృద్ది చేసేందుకు ఎండీ సజ్జనార్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోషల్ మీడియా విపరీతంగా వాడుకుంటున్నారు.

ప్రతి కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ల ద్వారా బస్సులో ప్రయాణం సుఖమయం అంటూ ఆయన ప్రచారం చేసే ప్రయత్నాలు చేసి చాలా వరకు సఫలం అవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆర్టీసీ మెల్ల మెల్లగా లాభాల్లో పడుతుంది అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. గతంలో పోలీసు శాఖలో పని చేసిన సజ్జనార్ ఇప్పుడు ఆర్టీసీ ని అద్భుతమైన విజయం దిశగా తీసుకెళ్తున్నాడు అంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా విడుదలైన రాధేశ్యామ్‌ ను కూడా ఉపయోగించుకొని తెలంగాణ ఆర్టీసీ కి పబ్లిసిటీ కల్పించేందుకు సజ్జనార్‌ ప్రయత్నించడం అభినందనీయం అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహించాడు.

ప్రభాస్ మరియు పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కీలక పాత్రలో కృష్ణంరాజు కనిపించారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అంతకు మించి ఈ సినిమా వసూళ్లు ఉంటాయనే నమ్మకం ను మేకర్స్ మరియు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News