సాయిధ‌ర‌మ్ తేజ్ ఫైన‌ల్ గా కెమెరా ముందు కొచ్చాడు

Update: 2022-03-29 06:30 GMT
మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 10న బైక్ యాక్సిడెంట్ కు గురైన విష‌యం తెలిసిందే. యాక్సిడెంట్ కార‌ణంగా అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ని ఓ యువ‌కుడు వెంట‌నే స‌మీప హాస్పిట‌ల్ లో చేర్పించ‌డం, విష‌యం తెలిసి అక్క‌డి నుంచి ఆయ‌న‌ని అపోలో హాస్పిట‌ల్స్ కి త‌ర‌లించి ఓ మైన‌ర్ ఆప‌రేష‌న్ చేయ‌డంతో సాయి ధ‌ర‌మ్ తేజ్ క్షేమంగా నెల రోజుల అనంత‌రం క్షేమంగా ఇంటికి తిరిగి వ‌చ్చారు.

ఇక క్షేమంగా హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన సాయి ధ‌ర‌మ్ తేజ్ అప్ప‌టి నుంచి మీడియాకు కూడా క‌నిపించ‌కుండా ఇంటి ప‌ట్టునే వుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు 7 నెల‌లుగా విశ్రాంతి తీసుకుంటున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆ మ‌ధ్య విజ‌య‌వాడ క‌న‌క దుర్గమ్మ‌వారి మొక్కు అంటూ బ‌య‌టికి వ‌చ్చాడే కానీ ముఖం కూడా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో స్పెష‌ల్ ఫొటో షూట్ ల‌తో అభిమానుల‌ని ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు.

తాను రెడీ అవుతున్నాన‌ని, కొత్త చిత్రానికి సిద్ధం అవుతున్నానంటూ సంకేతాల్ని అందించారు. ఇటీవ‌లే తొలిసారి ఓ వీడియోని విడుద‌ల చేసి త‌న‌కు యాక్సిండెంట్ అయిన ద‌గ్గ‌రి నుంచి తాను ఇంటికి చేరే వ‌ర‌కు త‌న‌కు అండ‌గా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికీ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు, కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు సాయి ధ‌ర‌మ్ తేజ్ అంటే కాకుండా త‌న కొత్త చిత్రాన్ని మార్చి 28న మంగ‌ళ‌వారం ప్రారంభిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు.

అన్న‌ట్టుగానే మంగళవారం కొత్త సినిమా సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రిప‌బ్లిక్ త‌రువాత సాయి ధ‌ర‌మ్ తేజ్ కొత్త ద‌ర్శ‌కుడు కార్తీక్ దండు డైరెక్ష‌న్ లో ఓ సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్, శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్ ల‌పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ తో క‌లిసి నిర్మిస్తున్నారు. థ్రిల్ల‌ర్ అంశాల నేప‌థ్యంలో సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ లో మొద‌లైంది.

ఇందుకు సంబంధించిన వీడియోని చిత్ర బృందం మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. సెట్ లో వున్న గుడితో పూజా అనంత‌రం సాయి ధ‌ర‌మ్ తేజ్ సెట్ లోకి అడుగుపెట్టారు. త‌నికి అదురుగా వ‌చ్చిన నిర్మాత బివిఎస్ ఎన్ ప్ర‌సాద్ ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకుని సాయి ధ‌ర‌మ్ తేజ్ కి సెట్ లోకి సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు. ఆ త‌రువాత సెట్ లోకి వ‌రుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చారు.

ఇద్ద‌రూ క‌లిసి కార‌వాన్ లో క‌బురు చెప్పుకున్నారు. అనంత‌రం మేక‌ప్ ముగించుకుని షాట్ కోసం లొకేష‌న్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధ‌ర‌మ్ తేజ్ కి యూనిట్ స‌భ్యులు వెల్మ్ బోర్డ్ ల‌తో స్వాగ‌తం ప‌ల‌క‌డం.. హీరోపై పూలు చ‌ల్లి హంగ‌మా చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. సెట్ లోకి సాయి ధ‌ర‌మ్ తేజ్ వ‌చ్చాడ‌ని తెలిసి పీపుల్స్ స్టార్ ఆర్ నారాయ‌ణ‌మూర్తి విచ్చేసి హీరోని అభినందించారు. డైరెక్ట‌ర్ సుకుమార్ వ‌చ్చి సాయి ధ‌ర‌మ్ తేజ్ కు వెల్క‌మ్ చెబుతూ శుభాకాంక్ష‌లు అంద‌జేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.
Tags:    

Similar News