వైఎస్ భారతితో భేటీ అయిన నమ్రత..ఎందుకో తెలుసా?

Update: 2019-10-25 09:38 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్‌ లోని సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రిపాలెం ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.  బుర్రిపాలెం గ్రామం.. గుంటూరు జిల్లా తెనాలి మండలంలో ఉంది. ఆ గ్రామానికి కావాల్సిన సకల సదుపాయాలని సూపర్ స్టార్ భార్య నమ్రత స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఈ విషయంలోనే  అమరావతిలోని.. తాడేపల్లిలోని సీఎం జగన్ మోహన్ రెడ్డి  ఇంట్లో వైఎస్ భారతితో భేటీ నమ్రతా అయ్యింది.  ఆంధ్రప్రదేశ్‌లోని హీరో మహేష్ బాబు దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామం ఫౌండేషన్ వివరాలు వైఎస్ భారతికి నమ్రత వివరించింది. అలాగే  ప్రభుత్వం నుంచి బుర్రిపాలెం గ్రామం కోసం సహకారం అందించాలని వైఎస్ భారతిని కోరింది.

సాధారణంగా మహేష్ భార్య  నమ్రత.. బయట ఎక్కువగా ఎవరినీ కలవరు. అలాంటిది - ఇప్పుడు సీఎం జగన్ భార్య అయిన వైఎస్ భారతిని కలవడం అందరిని కొంచెం  ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సీఎం జగన్ ఏపీ సీఎం గా ఎన్నికైన తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎవరూ కూడా ఆయనని మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు.  కొద్దిరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ని కలిశారు. చిరు నటించిన సైరా విజయం సాధించడంతో జగన్ ని సైరా సినిమాని చూడాలి అని కోరారు. అలాగే సీఎం జగన్ మెగాస్టార్ దంపతులకి విందుని కూడా రేపాటు చేసారు. ఇక ఇప్పుడు తాజాగా నమ్రత కూడా జగన్ ఇంటికి వెళ్లడంతో ఈ భేటీ వెనుక అసలు కారణం ఏమిటో అని ఆలోచనలో పడ్డారు.

మరిన్ని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

Tags:    

Similar News