మ‌ణిర‌త్నం సినిమా కొత్త పోస్ట‌రొచ్చింది

Update: 2016-11-11 17:30 GMT
మ‌ణిర‌త్నం సినిమా అంటే చాలు.. సౌత్ ఇండియాలో కోట్లాది మంది క‌ళ్లు విచ్చుకుని చూస్తారు. భాష‌తో సంబంధం లేకుండా భారీగా అభిమాన‌గ‌ణం సంపాదించుకున్నాడు ఈ సెల్యులాయిడ్ మెజీషియ‌న్. గ‌త ఏడాది ‘ఓకే బంగారంతో ఫామ్ లోకి వ‌చ్చిన మ‌ణి.. కొంచెం గ్యాప్ తీసుకుని కార్తి క‌థానాయ‌కుడిగా ఓ సినిమా మొద‌లుపెట్టాడు. అదే.. ‘కాట్రు వేళయిదై’. ఆ మ‌ధ్య ఒక అంద‌మైన పోస్ట‌ర్ తో ప‌ల‌క‌రించాడు మ‌ణి. అందులో కార్తి హాఫ్ లుక్ క‌నిపించింది. హీరోయిన్ అదితి రావు హైద‌రి కూడా అలాగే క‌నిపించింది. ఐతే ఇప్పుడు ఈ సినిమా కొత్త లుక్ వ‌దిలాడు మ‌ణి.

కార్తి. ఈ సినిమాలో పూర్తి భిన్నంగా ఉండ‌బోతున్నాడ‌ని ఈ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మైపోతుంది. కెరీర్లో తొలిసారి మీసం తీసి నున్న‌టి షేవ్ తో క‌నిపించ‌బోతున్నాడు కార్తి. అత‌డి లుక్ డిఫ‌రెంటుగా ఉంది. అదితి కూడా అందంగా క‌నిపిస్తోంది. ఈ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూ సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ కూడా ఇచ్చింది చిత్ర బృందం. ‘కాట్రు వేళ‌యిదై’ షూటింగ్ పూర్త‌యింద‌ట‌. మార్చిలో ఈ సిన‌మా రిలీజ‌వుతుంద‌ట‌. ఓకే బంగారం లాగే ఈ సినిమాను కూడా తెలుగులో దిల్ రాజే త‌న బేన‌ర్లో రిలీజ్ చేస్తాడ‌ట‌. త్వ‌ర‌లోనే తెలుగు టైటిల్ ఖాయం చేసి ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌. ఎప్ప‌ట్లాగే ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ‌ణి సినిమాకు సంగీతాన్నందిస్తున్నాడు. ర‌వివ‌ర్మ‌న్ కెమెరామ‌న్. త‌మిళంలో ఈ చిత్రాన్ని మ‌ణిర‌త్న‌మే  త‌న మ‌ద్రాస్ టాకీస్ బేన‌ర్ మీద నిర్మిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News