పదేళ్ల తర్వాత పరాయి దేశానికి మణి సార్!

Update: 2016-11-06 17:30 GMT
ఇండియా గర్వించే దిగ్గజ దర్శకుడు మణిరత్నం. దశాబ్దాలుగా ఎప్పటికప్పుడు తనను తాను అప్ డేట్ చేసుకుంటూ.. కాలంతో పాటు మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని అందుకుంటన్న సీనియర్ దర్శకుడాయన. మణిరత్నం సమకాలికుల్లో ఇప్పుడు డైరెక్షన్ కంటిన్యూ చేసేవాళ్లు కనిపించడం అరుదు.

అయితే.. ఎంత పెద్ద దర్శకుడయినా.. విదేశాలకు పోయి విపరీతంగా ఖర్చు పెట్టేయడం లాంటివి చేయరు మణి రత్నం. స్టోరీ నిజంగా డిమాండ్ చేస్తే తప్ప అసలు ఫారిన్ కంట్రీస్ కి వెళ్లే అలవాటు లేదు. ఇప్పుడు కార్తీ.. అదితి రావ్ హైదరి జంటగా నటిస్తున్న 'కాట్రు వెలియుదాయి' చిత్రం కోసం మణిరత్నం ఫారిన్ షూటింగ్ చేయనుండడం హాట్ టాపిక్ అయిపోయింది. బల్గేరియాలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను షూట్ చేయనున్నారు. మంచు కొండల్లో పాట తీయాల్సిన అవసరం ఉండడంతో.. బల్గేరియా టూర్ వెళుతున్నారు మణిసార్.

అభిషేక్ బచ్చన్.. ఐశ్వర్యా రాయ్ లతో తీసిన గురు తర్వాత.. మళ్లీ ఇప్పుడే మణిరత్నం విదేశాల్లో షూటింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే కార్తి నటిస్తున్న రొమాంటిక్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. నవంబర్ చివరకు పూర్తయిపోనుందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News