చిరు డౌటే... నాగ్ మాత్రం క‌న్ఫ‌ర్మ్?!

Update: 2015-07-26 10:05 GMT
చెర్రీ సినిమాకి సంబంధించి ఓ కొత్త న్యూస్ ప్ర‌చారంలో ఉంది. శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆ చిత్రంలో చిరంజీవి ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తార‌ని చెప్పుకొంటున్నారు. తాజాగా చిరుతో పాటు నాగార్జున పేరు కూడా వినిపిస్తుండ‌డం విశేషం. `మై నేమ్ ఈజ్ రాజూ` పేరు తో రూపొందుతున్న ఈ  సినిమాలో చ‌ర‌ణ్ ఓ ఫైట్ మాస్ట‌ర్‌ గా క‌నిపించ‌బోతున్నాడు. ఫైట్ మాస్ట‌ర్ క‌థ అంటే అందులో సినిమా హీరోలు కూడా క‌నిపిస్తాడు క‌దా! అందుకే శ్రీనువైట్ల తెర‌పై ప‌లువురు హీరోల్ని చూపించబోతున్నాడ‌ని తెలుస్తోంది. మ‌రి ఎవ‌రెవ‌రు క‌నిపిస్తారో  చూడాలి.

చిరంజీవి కూడా క‌నిపిస్తే బాగుంటుంద‌ని శ్రీనువైట్ల భావించాడ‌ట‌. అయితే చిరు చూద్దాం అని చెప్పాడ‌ట‌. నాగ్ అయితే  ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. నాగార్జున‌కీ-  శ్రీనువైట్ల‌ కీ, నాగార్జున‌ కీ- మెగా కుటుంబానికీ మంచి రిలేష‌న్స్ ఉన్నాయి. అందుకే  ఓ చిన్న మాట అడిగేస‌రికి నాగ్  వెంట‌నే ఓకే చెప్పేశార‌ని ఫిల్మ్‌ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నాగార్జునతోపాటు తెర‌పై  ఇంకా ఎవ‌రెవ‌రు క‌నిపిస్తారో అనే విష‌యంపై స‌స్పెన్స్ నెల‌కొంది.

`ఆగ‌డు` త‌ర్వాత శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. ఆయ‌న క‌సిమీద ఉన్నారు. పాత మిత్రులు కోన వెంక‌ట్‌, గోపీమోహ‌న్‌ లతో క‌లిసి ఈ సినిమా చేశారు. అందుకే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శాటిలైట్ హ‌క్కులు కూడా భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. ఈ సినిమాలో చెర్రీ స‌ర‌స‌న ర‌కుల్ న‌టించింది. ఆగ‌స్టులోనే సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే అవ‌కాశాలున్నాయి. డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాకి నిర్మాత‌. .
Tags:    

Similar News