'డైరెక్టర్' వేటలో కింగ్ నాగార్జున..!!

Update: 2020-07-21 17:30 GMT
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున తన తదుపరి సినిమాల విషయంలో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నాడు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకొని నటించిన మన్మధుడు2 సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు నాగార్జున తదుపరి సినిమాకు భారీ గ్యాప్ తీసుకున్నాడు. ఇక కొత్త డైరెక్టర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వైల్డ్ డాగ్' సినిమాను ఎలాంటి ఆర్భాటం లేకుండా సైలెంట్ గా చేస్తున్నాడు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సూపర్ హిట్ తర్వాత.. ఊపిరి సినిమా యావరేజ్ లిస్టులో చేరింది. అప్పటినుండి మొన్నటి దేవదాస్, మన్మధుడు2 వరకు నాగార్జున సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి. ఇక వైల్డ్ డాగ్ తో పాటుగా మరో సినిమా చేసేందుకు మొన్నటి వరకు కొత్త కథలు విన్న నాగ్ ఆఖరికి ప్రవీణ్ సత్తారు స్టోరీ ఓకే చేసాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ వారు నిర్మించనున్నారు.

అయితే మన్మధుడు-2 మూవీ దెబ్బ కొట్టడంతో నాగ్ ఇకపై రొమాంటిక్ మూవీస్ చేయకూడదని అనుకుంటున్నాడట. అందుకే వైల్డ్ డాగ్, ప్రవీణ్ సత్తారు మూవీస్ రెండు కూడా యాక్షన్ థ్రిల్లర్లు చేస్తున్నాడు. ఇక ఇటీవలే కథల వేటలో పడిన నాగ్.. తాజాగా బాలీవుడ్ మూవీపై దృష్టి పెడుతున్నాడు. 2018లో స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన మూవీ 'రైడ్'. ఇన్కమ్ టాక్స్ కుంభకోణంలోని చీకటి కోణాలను బయట పెట్టే విధంగా.. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. 45కోట్లతో రూపొందిన రైడ్.. బాక్సాఫీస్ వద్ద 100కోట్ల పైనే వసూల్ చేసి సూపర్ హిట్ అయింది. అయితే ప్రస్తుతం నాగార్జున రైడ్ మూవీపై కన్నేశాడు. ఆ మూవీని తెలుగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే రీమేక్ హక్కులు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన మూవీకోసం డైరెక్టర్ల వేటలో ఉన్నాడు నాగ్. ప్రస్తుతం కొందరిని పరిశీలిస్తున్నారట. అన్నపూర్ణ బ్యానర్లో నాగ్ నటిస్తూ నిర్మించనున్న ఈ మూవీకి ఏ డైరెక్టర్ని ఎంచుకుంటాడో చూడాలి.
Tags:    

Similar News