లోకల్ డైరెక్టర్ తో బెల్లంకొండ మూవీ

Update: 2017-04-12 05:50 GMT
నేను లోకల్ మూవీ సాధించిన విజయం చాలా పెద్దది. నాని లాంటి మీడియం బడ్జెట్ హీరోతో 33 కోట్లకు రూపాయలకు పైగా షేర్ సాధించడం అంటే.. బ్లాక్ బస్టర్ లకే బ్లాక్ బస్టర్ అనాల్సిందే. ఈ మూవీ తర్వాత దర్శకుడు త్రినాధరావుకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఇతను బెల్లంకొండ శ్రీనివాస్ తో జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు నక్కిన త్రినాధ రావు గత చిత్రం కూడా మంచి హిట్ సాధించింది. రాజ్ తరుణ్ తో తీసిన సినిమా చూపిస్త మామ కూడా ఆడియన్స్ ను మెప్పించింది. అయితే.. ఈ రెండు సినిమాలను నిర్మాత బెక్కం వేణుగోపాల్ కే చేశాడు త్రినాధ రావు. ఇప్పుడు తన మూడో చిత్రాన్ని కూడా ఈ ప్రొడ్యూసర్ కే చేయనుండగా.. త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా నక్కినతో జోడీ కట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాడు. యూత్ సినిమాలు తీయడం.. యువతను ఆకట్టుకోవడంలో.. నక్కిన త్రినాధరావు ట్యాలెంట్ ఇప్పటికే ప్రూవ్ కావడంతో.. వెంటనే సినిమాకి సై అన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్.. ఆ తర్వాత శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. దాని తర్వాత నక్కిన త్రినాధరావుతో సినిమా స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News