మహేష్ కెరీర్ సెన్సేషనల్ హిట్ చిత్రం `పోకిరి` రిలీజై ఇప్పటికే 14 సంవత్సరాలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ లో ఈ మూవీపై గత రెండ్రోజులుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. 2006లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించి బాక్సాఫీసు వద్ద ఒక నూతన ఒవరడిని సృష్టించింది. ఆ రోజుల్లోనే ఇండస్ట్రీ రికార్డ్ హిట్ కొట్టడమే గాక 40 కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాగా ఘనుతికెక్కింది. రామ్ చరణ్ నటించిన `మగధీర` కు మునుపు తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది.
ఇక ఈ మూవీ మహేష్ ని ఏకంగా సూపర్ స్టార్ నే చేసింది. పూరి జగన్నాథ్ కెరీర్ కి మరపురాని విజయం అయ్యింది. ఇందులో నటించిన ఇలియానా కెరీర్ అమాంతం స్కైలోకి దూసుకెళ్లింది. ఇక ఈ మూవీలో నాజర్ - ప్రకాష్ రాజ్ లాంటి వెటరన్ స్టార్లు పోటీపడి మరీ నటించారు.
ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతుంటే.. ఇంతకుముందు ఎవరికీ తెలీని ఓ కొత్త విషయాన్ని నమ్రత రివీల్ చేశారు. వంశీ చిత్రీకరణ సమయంలో మహేష్ - నమ్రత ఒకరినొకరు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా పోకిరి సమయంలో తాను గర్భవతి అయ్యారట. ఆ విషయాన్ని నమ్రత తాజాగా వెల్లడించారు. పోకిరి ఎన్నో జీవితాల్ని మార్చిన సినిమా. మహేష్ కానీ మా కుటుంబం కానీ ఎప్పటికీ మర్చిపోలేనిది అని ఈ సందర్భంగా ఎమోషనల్ గా తెలిపారు.
``పోకిరి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ... ఈ విజయంతో పాటు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వివాహం తర్వాత మా జ్ఞాపకాల్లో రెండో చిత్రమిది. గౌతమ్ ని నా కడుపులో మోస్తున్న సమయంలోనే... పోకిరి చిత్రీకరణ సాగింది. మా జీవితాలను శాశ్వతంగా మార్చివేసిన చిత్రమిది !!`` అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఉద్వేగనికి లోనయ్యారు నమ్రత. ఈ చిత్రం ఎప్పటికప్పుడు పాత్ బ్రేకింగ్ క్లాసిక్ గా తెలుగు సినిమా చరిత్రలో నిలుస్తుంది. పండు గాడి సంచలనం అంతా ఇంతా కాదు. మహేష్- పూరి జగన్ కలయికలో మాయాజాలం ఇది. ఆ జ్ఞాపకం ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది`` అని ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ ఇప్పటికి ఇంతింతై అన్న చందంగా ఎదిగేసిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు ఆయన కెరీర్ 26వ చిత్రం. ప్రస్తుతం ఎంబీ 27కి పరశురామ్ దర్శకత్వం లో సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇక ఈ మూవీ మహేష్ ని ఏకంగా సూపర్ స్టార్ నే చేసింది. పూరి జగన్నాథ్ కెరీర్ కి మరపురాని విజయం అయ్యింది. ఇందులో నటించిన ఇలియానా కెరీర్ అమాంతం స్కైలోకి దూసుకెళ్లింది. ఇక ఈ మూవీలో నాజర్ - ప్రకాష్ రాజ్ లాంటి వెటరన్ స్టార్లు పోటీపడి మరీ నటించారు.
ఇన్నేళ్ల తర్వాత ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతుంటే.. ఇంతకుముందు ఎవరికీ తెలీని ఓ కొత్త విషయాన్ని నమ్రత రివీల్ చేశారు. వంశీ చిత్రీకరణ సమయంలో మహేష్ - నమ్రత ఒకరినొకరు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా పోకిరి సమయంలో తాను గర్భవతి అయ్యారట. ఆ విషయాన్ని నమ్రత తాజాగా వెల్లడించారు. పోకిరి ఎన్నో జీవితాల్ని మార్చిన సినిమా. మహేష్ కానీ మా కుటుంబం కానీ ఎప్పటికీ మర్చిపోలేనిది అని ఈ సందర్భంగా ఎమోషనల్ గా తెలిపారు.
``పోకిరి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ... ఈ విజయంతో పాటు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వివాహం తర్వాత మా జ్ఞాపకాల్లో రెండో చిత్రమిది. గౌతమ్ ని నా కడుపులో మోస్తున్న సమయంలోనే... పోకిరి చిత్రీకరణ సాగింది. మా జీవితాలను శాశ్వతంగా మార్చివేసిన చిత్రమిది !!`` అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ఉద్వేగనికి లోనయ్యారు నమ్రత. ఈ చిత్రం ఎప్పటికప్పుడు పాత్ బ్రేకింగ్ క్లాసిక్ గా తెలుగు సినిమా చరిత్రలో నిలుస్తుంది. పండు గాడి సంచలనం అంతా ఇంతా కాదు. మహేష్- పూరి జగన్ కలయికలో మాయాజాలం ఇది. ఆ జ్ఞాపకం ఎల్లప్పుడూ నాతోనే ఉంటుంది`` అని ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ ఇప్పటికి ఇంతింతై అన్న చందంగా ఎదిగేసిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు ఆయన కెరీర్ 26వ చిత్రం. ప్రస్తుతం ఎంబీ 27కి పరశురామ్ దర్శకత్వం లో సన్నాహాలు చేస్తున్నారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం సెట్స్ కెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.