పాపం నిత్యా మీనన్‌ ను పట్టుకు లాగుతున్నది ఎవడ్రా..!

Update: 2022-08-26 09:30 GMT
మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు లో ఈ అమ్మడు అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్ స్కిన్‌ షో కు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. తన పట్టుదల మరియు పంతం కారణంగా ప్రతిభ ఉన్నా కూడా స్టార్‌ కాలేక పోయిందనే అభిప్రాయం ఉంది.

నిత్యామీనన్ కెరీర్‌ ఆరంభం నుండి కూడా ఏదో ఒక వివాదం ఆమె చుట్టూ ఉంటూనే ఉంది. టాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లో కూడా ఏదో ఒక వివాదం ఈమె చుట్టు ముట్టి ఉంటుంది. హీరోయిన్‌ గా నిత్యా మీనన్ నటించిన సినిమాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఆమె వ్యవహరించిన తీరుతోనే ఇబ్బంది అనేది చాలా మంది అభిప్రాయం.

నటిగా ప్రతిభావంతురాలు అయిన నిత్యా మీనన్ కాస్త పొగరు గా మాట్లాడుతుంది అనేది చాలా కాలంగా కొందరి అభిప్రాయం. ఆ పొగరు వల్లే ఇండస్ట్రీ లో ఆమె స్టార్ గా నిలవలేకపోయింది అనేది కొందరి అభిప్రాయం. అయితే ఆమెకు మాత్రమే సాధ్యమైన పాత్రలు రెగ్యులర్ గా ఆమె వద్దకు వెళ్తూనే ఉన్నాయి. కెరీర్‌ ఆరంభించినప్పటి నుండి కూడా నిత్యా మీనన్ బిజీగానే ఉంది.

తాజాగా ధనుష్‌ తో కలిసి నటించిన తిరు చిట్రంఫలం అనే సినిమా విడుదల అయ్యి పాజిటివ్‌ టాక్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా తన పై ఈ మధ్య కాలంలో వస్తున్న వివాదాస్పద అంశాలపై స్పందించింది. తనకు ఇండస్ట్రీలో చాలా మంది శత్రువులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

మన ఎదుగుదల గిట్టని వారు.. వాళ్ల మాట వినకుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాతో పని చేయడం చాలా కష్టం అంటూ ప్రచారం చేయడంతో పాటు నన్ను కిందకు లాగేందుకు ప్రయత్నిస్తున్న వారు చాలా మందే ఉన్నారంటూ నిత్యా మీనన్ పేర్కొంది.

ఇప్పటి వరకు నాతో వర్క్ చేసిన ఏ ఒక్కరు కూడా నా తో వర్క్ చేయడం కష్టం అనలేదు. కానీ కొందరు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిత్యా మీనన్ అసహనం వ్యక్తం చేసింది.
Tags:    

Similar News