నిత్యామీనన్‌ ఫ్యాన్స్‌.. గెట్‌ రెడీ

Update: 2015-04-07 13:30 GMT
స్టార్‌ హీరో అభిమానులకు పిలుపిచ్చినిట్లు.. గెట్‌ రెడీ అనడమేంటి అనుకోకండి. నిత్య మీనన్‌కు డైహార్డ్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు మనదగ్గర. తొలి సినిమా 'అలా మొదలైంది'తోనే చాలామంది గుండెల్లో కొలువైపోయింది ఈ మలయాళ కుట్టి. కేవలం తన కోసమే సినిమాలు చూసే నిత్యదాసులు చాలామంది ఉన్నారిక్కడ. నిత్య సినిమా ఒప్పుకుందంటేనే అందులో ఏదో ఒక విశేషం ఉంటుందని నమ్ముతారు ఆమె అభిమానులు.

ఇంతకీ ఈ గెట్‌ రెడీ అన్న మాట ఎందుకంటే.. ఈ నెలలో నిత్య కెరీర్‌కు, ఆమె అభిమానులకు చాలా ముఖ్యం. ఆమె నటించిన మూడు వైవిధ్యమైన సినిమాలు ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ముందుగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నిత్య బన్నీ సరసన నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' విడుదలవుతోంది. ఇప్పటిదాకా నిత్య ఇలాంటి కమర్షియల్‌ ఎంటర్టైనర్స్‌లో, ఇంత పెద్ద సినిమాల్లో నటించింది లేదు. నిత్యకు పోటీగా ఇంకో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉండటంతో తన ప్రత్యేకత ఎలా చూపిస్తుందన్నది ఆసక్తికరం.

సన్నాఫ్‌ సత్యమూర్తి అయిపోయాక.. నిత్య కెరీర్లోనే ప్రెస్టీజియస్‌ మూవీ అనదగ్గ 'ఓకే బంగారం' విడుదలవుతోంది. మణిరత్నం లాంటి దర్శకుడితో పని చేయడం ఎవరికైనా కలే. నటీనటుల్లోకి కొత్త కోణాన్ని బయటికి తీస్తుంటాడు మణిరత్నం. మామూలుగానే నిత్య మంచి నటి కాబట్టి మణి సినిమాలో మరింత చెలరేగిపోయి ఉంటుందన్నది అభిమానుల ఆశ. ఇక చివరగా చెప్పుకోవాల్సింది 'కాంఛన-2' గురించి. ఈ సినిమాలో నిత్యది చాలా కీలకమైన పాత్ర అని.. కథ మలుపు తిరిగేదే ఆమె క్యారెక్టర్‌తో అని చెబుతున్నాడు లారెన్స్‌. నెలాఖర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.

Tags:    

Similar News