చిరుకే కాదు వారికి కూడా డ్రీం ప్రాజెక్ట్!

Update: 2019-09-25 01:30 GMT
ఒక కథను దానికి సంబంధించి రచయితలు ఓ రెండు మూడేళ్ళు మోస్తూ చివరికి ఓ హీరో దగ్గరికి చేర్చి పడిన కష్టమంతా మర్చిపోతుంటారు. అయితే పరుచూరి బ్రదర్స్ మాత్రం ఓ పదేళ్ళు 'సైరా' కథ తో పడిగాపులు కాసి చివరికి ఇప్పటికి ఆనందం పొందుతున్నారు.  సరిగ్గా పదేళ్ళ క్రితం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చరిత్రతో కథను సిద్దం చేసి కొందరు హీరోలను కలిసారు. అందులో చిరు చివరి హీరో.

చిరంజీవి కంటే ముందే ఈ కథ కొందరు ప్రముఖ హీరోల దగ్గరికి వెళ్ళింది. చిరు కంటే ముందే  ఈ కథను బాలకృష్ణ  దగ్గరికి కూడా పరుచూరి బ్రదర్స్ తీసుకెళ్ళారనే టాక్ ఉంది. కాకపోతే బాలయ్య సంసయించడంతో అప్పుడు మెగా స్టార్ దగ్గరికి వెళ్ళారనే వార్త ఆ మధ్య చక్కర్లు కొట్టింది.

నిజానికి ఇది చిరంజీవి కంటే పరుచూరి బ్రదర్స్ డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. రాత్రి పగలు తేడా లేకుండా ఈ కథను సిద్దం చేయడానికి ఓ స్టార్ చేతిలో పెట్టడానికి వారు కష్టపడ్డారు. ఎట్టకేలకు ఇప్పుడు వారి కథకు రెక్కలొచ్చి మెగా స్టార్ కి సెట్ అయి సినిమాగా రాబోతుంది. మరి కొన్ని రోజుల్లో సినిమా చూస్తూ  ఈ రచయిత కళ్ళల్లో ఆనందభాష్పాలు  రావడం ఖాయం అనిపిస్తుంది. ఇక అక్టోబర్ 2 తో వారి కష్టానికి ప్రతిఫలం దక్కబోతుంది.
Tags:    

Similar News