పెన్నీ సాంగ్.. థియేట‌ర్ల‌లో ఫైర్ గ్యారెంటీ

Update: 2022-04-27 15:30 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వం వ‌హించిన సినిమా 'స‌ర్కార్ వారి పాట‌'. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టించింది. మైత్రీ మూవీస్- జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం నుండి విడుదలైన పెన్నీ సాంగ్ బిట్‌ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది.  చిత్రంలోని రెండో పాట పెన్నీ కి సితార డ్యాన్సులు కూడా బోలెడంత హైప్ ని క్రియేట్ చేసాయి.

పెన్నీ సాంగ్ ప్రోమోకు విశేషమైన స్పందన వచ్చింది. అందులో మహేష్ బాబు కూతురు సితారను చూసి అందరూ షాక్ అయ్యారు. సితార వేసిన స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇటీవల విడుదలైన ఫుల్ సాంగ్ లోనూ సితార దుమ్మురేపింది.ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా... నకాష్ అజీజ్ పాడారు.

ఈ పాటను శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో కొరియోగ్రఫీ చేశారు. ఈ పాట చూస్తుంటే.. ఇందులో మహేష్ బాబు పాత్ర ఏంటో అర్థమవుతుంది. అప్పుగా ఇచ్చిన ప్రతి పైసాకు వడ్డీ వసూలు చేసేవాడిగా మ‌హేష్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. అందుకే ప్రతి ఒక్క పైసాను గౌరవించాలని ఎవరినీ కాదని పాట చెబుతోంది. గుడిలోనో గుహలోనో  ఎదురై వడ్డీ వసూలు చేస్తానని పాటలో రాశారు.

ఈ పాటకు ఇప్ప‌టికే సితార 'తమన్ 'మహేష్ బాబు తమదైన శైలిలో స్టెప్పులేశారు. మరీ ముఖ్యంగా సితారను ఇలా ఒక సాంగ్ లో చూడటం అందరికీ కొత్తే. సితారను చూసి ఘట్టమనేని అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

తాజాగా ఈ పాట గురించి సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ ట్విట్ట‌ర్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను చేశారు. పెన్నీ సాంగ్ థియేట‌ర్ల‌లో స్క్రీన్ పై వ‌చ్చేప్పుడు ఫైర్ ఖాయం అన్న వ్యాఖ్యను జోడించాడు. సెన్సేష‌న‌ల్ పెన్నీసాంగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఈ విష‌యాన్ని వైర‌ల్ చేస్తున్నాడు. మొత్తానికి పెన్నీ సాంగ్ ఈ మూవీలోనే హైలైట్ గా నిలుస్తుంద‌ని థ‌మ‌న్ హింట్ ఇచ్చాడు. ఈ పాట వ‌చ్చేప్పుడు స్క్రీన్ ముందే లేచి అభిమానులు స్టెప్పులేయ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ టీమ్ స‌రైన ప్ర‌చారం చేయ‌డం లేదు అన్న విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు థ‌మ‌న్ ఇలా ఒక్కో హింట్ ఇస్తున్నాడ‌న్న‌మాట‌. మే 12న స‌ర్కార్ వారి పాట ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే అమెరికాలో బుకింగులు కూడా ఓపెన్ అయ్యాయి. అక్క‌డ ప్రీమియ‌ర్ల‌తోనే పెట్టుబ‌డులు రాబ‌ట్టేందుకు భారీ రిలీజ్ ని ప్లాన్ చేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ హిట్టు టాక్ తెచ్చుకుంటే ఈ చిత్రం సునాయాసంగా 200 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని మ‌హేష్ అభిమానుల్లో టాక్ వినిపిస్తోంది. వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న మ‌హేష్ తో గీత గోవిందం లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తెర‌కెక్కించిన ప‌ర‌శురామ్ వ‌ర్క్ చేస్తుండ‌డంతో బోలెడంత హైప్ నెల‌కొంది.
Tags:    

Similar News