భ‌ర్త పాదాల‌కు మొక్కి దీవెన‌లు అందుకున్న ప్ర‌ణీత‌!

Update: 2022-07-29 03:58 GMT
'అత్తారింటికి దారేది' ఫేం ప్ర‌ణీత సుభాష్ ఇటీవ‌ల అత్తారింట అడుగుపెట్టినప్ప‌టి నుంచి త‌న సోష‌ల్ మీడియాలో బోలెడంత హంగామా కనిపిస్తోంది. ఇటీవ‌లే భర్త నితిన్ రాజు.. త‌న వార‌సురాలితో ఫోటోషూట్ ని ప్ర‌ణీత షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. భ‌ర్త కుమార్తెతో త‌న హ్యాపీ లైఫ్ కి సంబంధించిన ప్ర‌తి గ్లింప్స్ ని ప్ర‌ణీత ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తోంది.  తన డెలివరీకి ముందు... డెలివరీ తర్వాత అనుభ‌వాల‌ గురించిన చాలా విష‌యాల‌పై వీడియోను కూడా షేర్ చేసింది. ఇవ‌న్నీ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

మ‌రోవైపు ప్ర‌ణీత సామాజిక రాజ‌కీయ అంశాల‌పైనా స్పందిస్తోంది. హిందూ స‌మాజానికి ర‌క్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని బ‌హిరంగంగా త‌న ఆకాంక్ష‌ను బ‌య‌ట‌పెడుతోంది. దీనికి సోష‌ల్ మీడియాల్లో ప్ర‌శంస‌ల‌తో పాటు ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంది. చాలాసార్లు వివాదాల‌తో హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది.

తాజాగా మ‌రో అరుదైన ఫోటోగ్రాఫ్ ని ప్ర‌ణీత సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్ లో త‌న భ‌ర్త పాదాల‌కు మొక్కి శ్ర‌ద్ధ‌గా పూజ‌లాచ‌రిస్తూ క‌నిపించింది. 'భీమ‌న అమావాస్య' రోజున ఇలా భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో క‌నిపించి అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌న‌ భ‌ర్త పాదాల‌ను ఒక వెండి ప‌ళ్లెంలో ఉంచి .. పూల‌తో అలంక‌రించి దీపారాధ‌న చేసింది. తాను నేల‌పై ఆశీనురాలై భ‌ర్త‌ ఆశీస్సుల‌ను అందుకుంది.

త‌న‌ని ఇలా చూడ‌గానే అభిమానులు ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు. సాంప్ర‌దాయం  అంటే ఇదే. భార‌తీయ స్త్రీలు సాంప్ర‌దాయానికి క‌ట్టుబ‌డి ఉండ‌డం వ‌ల్ల‌.. భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌ను క‌లిగి ఉండ‌డం వ‌ల్ల‌నే ఇంకా కుటుంబ జీవ‌నం స‌జావుగా కొన‌సాగుతోంది! అన్న ప్రశంస‌లు కురుస్తున్నాయి. మొత్తానికి ప్ర‌ణీత అంద‌రి దృష్టిని త‌న‌వైపున‌కు తిప్పుకుంది.

కన్నడ చిత్రం పోర్కితో న‌టిగా కెరీర్ ని ప్రారంభించిన 28 ఏళ్ల ప్ర‌ణీత శాండ‌ల్వుడ్ -టాలీవుడ్ - కోలీవుడ్ లో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించింది.  మహేష్ బాబు- పవన్ కళ్యాణ్- ఉపేంద్ర- జూనియర్ ఎన్టీఆర్- బాల‌కృష్ణ‌- సూర్య- శివరాజ్ కుమార్ - కార్తీ వంటి పెద్ద స్టార్ల స‌ర‌స‌న న‌టించింది. 40 సినిమాలకు పైగా న‌టించింది.

ప్ర‌ణీత‌ ప్రణిత సుభాష్ ప్రధానంగా కన్నడ- తమిళం- తెలుగు సినిమాల్లో న‌టించింది. 2021లో- శిల్పా శెట్టి-మీజాన్ జాఫేరితో కలిసి నటించిన హంగామా 2తో హిందీలో అరంగేట్రం చేసింది. భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియాలో కూడా కనిపించింది. ఇందులో అజయ్ దేవగన్- సోనాక్షి సిన్హాతో కలిసి నటించారు.


Tags:    

Similar News