ప్రశాంత్ నీల్ లైనప్ అదిరిపోయిందిగా

Update: 2023-01-18 03:30 GMT
కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. రాజమౌళి తర్వాత ఇండియాలో ఆ స్థాయి క్రేజ్ ని ప్రశాంత్ నీల్ సొంతం చేసుకున్నాడని చెప్పాలి. ఇక ఆయన బ్రాండ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని హీరోలు, నిర్మాతలు అందరూ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే గ్యాప్ లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో కమిట్ అయ్యి ఉన్నాడు. కేజీఎఫ్ తర్వాత తెరక్కుతున్న సలార్ మూవీ ఇంకా పూర్తి కాకుండానే టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా ప్రశాంత్ తో సినిమాలు చేయడానికి ఒకే చెప్పారు. ఇక వీటికి నిర్మాతలు కూడా రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం వీరందరికి పాన్ ఇండియా మార్కెట్ ఉన్న నేప్ నేపధ్యంలో 200 కోట్ల బడ్జెట్ కూడా ఏమీ కాకుండా పెట్టడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాల లైన్ అప్ చూసుకుంటే వరుసగా అందరూ స్టార్ హీరోలే ఉండటం విశేషం.

సలార్ మూవీని ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ తర్వాత ఎన్టీఆర్ తో మరో ప్రాజెక్ట్ ని ఫైనల్ చేసుకున్నాడు. ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి ఒకే చెప్పాడు. అలాగే దిల్ రాజు నిర్మాణంలో మళ్ళీ ప్రభాస్ తో ఒక సినిమాని ఫైనల్ చేసుకున్నాడు.

దీంతో పాటుగా కేజీఎఫ్ సిరీస్ లో మూడో భాగానికి సంబంధించి స్టొరీ లైన్ ఇప్పటికే నిర్మాతలకి చెప్పేసాడు. వారు కూడా ఫైనల్ చేసేశారు. ఈ మూవీ కూడా ఆన్ రోల్ లో ఉంది. దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా  ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కూడా ప్రశాంత్ లైన్ అప్ లో ఉంది. దీనిని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మించే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో గ్యాప్ లేకుండా ఓ పదేళ్ళకి సరిపడా కెరియర్ ని ప్రశాంత్ నీల్ టాలీవుడ్ హీరోలతో ప్లాన్ చేసుకున్నాడనే మాట ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News