'RRR' త‌రువాత రాజ‌మౌళి నెక్స్ట్ టార్గెట్

Update: 2022-01-08 06:30 GMT
టాలీవుడ్ టాప్ స్టార్స్ ప్ర‌స్తుతం బాలీవుడ్ పై క‌న్నేసిన విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్ బాబు, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ .. ఇలా మ‌న టాప్ స్టార్స్ బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇదే త‌ర‌హాలో మ‌న స్టార్ డైరెక్ట‌ర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కూడా బాలీవుడ్ బాట‌ప‌ట్ట‌బోతున్నాడు. ఇందు కోసం భారీ స్కెచ్ నే ఆయ‌న సిద్ధం చేసుకున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అంతే కాకుండా `బాహుబ‌లి` త‌రువాత బాలీవుడ్ లో రాజ‌మౌళి అంటే క్రేజ్ పెరిగిపోయింది. ఆయ‌న డైరెక్ష‌న్ లో న‌టించాల‌ని బాలీవుడ్ టాప్ స్టార్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారంటే జ‌క్క‌న్న క్రేజ్ ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే జ‌క్క‌న్న డైరెక్ష‌న్ లో న‌టించాల‌ని వుంద‌ని, ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నామ‌ని స్వ‌యంగా అమీర్ ఖాన్ లాంటా టాప్ స్టార్ త‌న కోరిక‌ని వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇక `RRR` ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా రాజ‌మౌళి వారం రోజుల పాటు బాలీవుడ్ లోనే తిష్ట‌వేశారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ వ‌ర్గాల‌తో మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని అది మ‌రింత క్రేజ్‌ని పెంచింద‌ని చెబుతున్నారు.

`RRR` ఈ సంక్రాంతికి విడుద‌ల కావాల్సింది. కానీ దేశంలో నెల‌కొన్న తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మూవీ రిలీజ్ ని వాయిదా వేశారు. అయితే ఈ మూవీ త‌రువాత జ‌క్క‌న్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో పాన్ ఇండియా స్థాయి మూవీని ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ స్థాయి యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీ గురించి ఇటీవ‌ల `RRR` ప్ర‌మోష‌న్స్ సంద‌ర్భంగా రాజ‌మౌళి వెల్ల‌డించారు కూడా. కానీ `RRR` త‌రువాత మ‌హేష్ మూవీ కాకుండా బాలీవుడ్ మూవీని రాజ‌మౌళి చేసే అవ‌కాశం వుంద‌ని తాజా స‌మాచారం.  

అంతే కాకుండా ఈ మూవీని భారీ బ‌డ్జెట్ తో కాకుండా `మ‌ర్యాద రామ‌న్న‌` త‌ర‌హాలో మీడియం బ‌డ్జెట్ తో తెర‌కెక్కించాల‌ని జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం టాక్స్ ద‌శ‌లో వున్న ఈ మూవీలో ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టిస్తున్న‌ `బ్ర‌హ్మాస్త్ర‌` తెలుగు వెర్ష‌న్ కి రాజ‌మౌళి భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగానే వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింద‌ని, అది ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం హైద‌రాబాద్ లో అడుగుపెట్టిన వేళ ర‌ణ్ బీర్ క‌పూర్  `బ్ర‌హ్మాస్త్ర‌` ఈవెంట్ లో రాజ‌మౌళి పాదాలని తాకి ఆయ‌న ఆశీస్సులు తీసుకునే ప్ర‌య‌త్నం చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

తాజా వార్త‌ల నేప‌థ్యంలో మ‌హేష్ ప్రాజెక్ట్ ని ప‌క్క‌న పెట్టి రాజ‌మౌళి బాలీవుడ్ ఆడియ‌న్స్ కోసం ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్రాజెక్ట్ ని ప‌ట్టాలెక్కిస్తే మాత్రం మహేష్ మ‌రి కొంత కాలం ఎదురుచూడ‌క త‌ప్ప‌దు. జ‌క్క‌న‌తో సినిమా అంటే ఆ మాత్రం వేయిటింగ్ వుండాల్సిందే అంటున్నారు టాలీవుడ్ జ‌నం. రాజ‌మౌళితో మంచి ర్యాపో వున్న ఎన్టీఆరే ఆయ‌న పిలుపు కోసం ఏళ్లు ఎదురుచూడాల్సి వ‌చ్చిందని ఈ సంద‌ర్భంగా చెప్పుకుంటున్నారు.

అన్న‌ట్టు ప్ర‌స్తుతం మ‌హేష్ `స‌ర్కారు వారి పాట‌` చేస్తున్న విష‌యం తెలిసిందే. ప‌ర‌శురామ్ పెట్ల తెర‌కెక్కిస్తున్న ఈ భారీ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామాని మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కావాల్సి వుంది అయితే మ‌హేష్ కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డం వ‌ల్ల‌ షూటింగ్ ని మ‌ళ్లీ వాయిదా వేశారు.
Tags:    

Similar News