ఆ సీరియల్ ను ప్రమోట్ చేయనున్న జక్కన్న

Update: 2020-03-13 03:30 GMT
ఒకప్పుడు తెలుగు లో బాగా క్లిక్ అయిన సీరియల్స్ వేళ్ళ మీద లేక్కేయొచ్చు. అందులో 'అమృతం' ఒకటి. కామెడీ పాత్రలతో కంప్లీట్ గా ఎంటర్టైన్ చేసి క్లాసిక్ అనిపించుకున్న ఈ సీరియల్ కి ఇప్పుడు రెండో సిరీస్ వస్తుంది. అవును నిర్మాత గుణ్ణం గంగరాజుతో కలిసి జీ 5 సంస్థ ఈ సీరియల్ ను మళ్ళీ తీసుకొస్తుంది.

మార్చ్ 25 న ఉగాది స్పెషల్ గా ఈ సీరియల్ జీ 5 లో ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే ప్రమోషన్ కూడా మొదలుపెట్టిన టీం తాజాగా అమృతం కోసం జక్కన్న సపోర్ట్ కోరింది. దీంతో రాజమౌళి ఇప్పుడు రంగంలోకి దిగి సోషల్ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా 'అమృతం 2' ను ప్రమోట్ చేయబోతున్నాడు. రేపు ట్విట్టర్ ద్వారా సీరియల్ ట్రైలర్ ను రిలీజ్ చేసి తన మనసులో మాట చెప్తారు జక్కన్న.

దీంతో అమృతం 2 ఒక్కసారిగా మళ్ళీ అందరి నోట్లో నానుతుంది. ఎలాగు ఎపిసోడ్స్ బాగుంటే జనాలు చూస్తారు కాబట్టి క్లిక్ అయ్యే చాన్స్ ఉంది. ఇక జక్కన్న రేపు ఈ ట్రైలర్ లాంచ్ చేసి ఏం చెప్తారో చూడాలి.
Tags:    

Similar News