పెళ్లి పై రకుల్‌ వ్యాఖ్యలతో గందరగోళం

Update: 2022-10-13 07:30 GMT
టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌ కే పరిమితం అయ్యింది. తెలుగు లో కొండ పొలం సినిమా తర్వాత ఈమె కమిట్‌ అయిన సినిమాలు ఏమీ లేవు. తమిళంలో ఒకటి రెండు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఈమె గురించి పెద్దగా పట్టించుకోవడం లేదా లేదంటే అసలు ఈమెకే తెలుగు లో నటించేందుకు ఆసక్తి లేదా అనేది అర్థం కావడం లేదు.

తెలుగు లో నటించే విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. నాకు ఈ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టింది తెలుగు సినిమా పరిశ్రమ. కనుక నేను తప్పకుండా తెలుగు లో నటించాలని కోరుకుంటాను అంది.

టాలీవుడ్‌ లో ఈ అమ్మడు చేసిన సినిమాల్లో కొన్ని సూపర్ హిట్‌ అయిన నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈమె అంటే అభిమానం చాలా మందిలో ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఈ అమ్మడు తాను ప్రేమలో ఉన్నట్లుగా చాలా నెలల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇతర జంటల మాదిరిగా వీరిద్దరు ఫోటోలను షేర్‌ చేయడం లేదు.. పార్టీలకు తిరుగుతున్న వీడియోలు బయటకు రావడం లేదు.

అసలు వీరిద్దరు కలిసే ఉన్నారా అంటూ వస్తున్న అనుమానాలపై రకుల్‌ సోదరుడు అమన్‌ ఇటీవల స్పందించాడు. రకుల్ మరియు జాకీ భగ్నానీ లు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు.. వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ విషయమై రకుల్‌ చేసిన వ్యాఖ్యలు గందరగోళం ను క్రియేట్‌ చేస్తోంది.

రకుల్‌ మాట్లాడుతూ.. నా పెళ్లి గురించి నువ్వు నిజంగా స్పష్టతను ఇచ్చావా... నా పెళ్లి గురించి నాకు కూడా కాస్త క్లారిటీ ఇవ్వాలి కదా బ్రో, నా జీవితం గురించి నాకే తెలియకుండా పోయింది అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లుగా మాట్లాడింది. దాంతో జాకీ భగ్నానీ తో ఈమె ప్రేమలో ఉందా .. పెళ్లి చేసుకుంటారా అనే అనుమానాలు మళ్లీ మొదలు అయ్యాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News