రాజమండ్రిలో ల్యాండ్ అయిన చరణ్‌

Update: 2017-04-01 09:41 GMT
ఇప్పుడు నాలుగు రోజులు హైదరాబాదులో టెస్ట్ షూట్లూ గట్రా అయిపోయాక.. అఫీషియల్ గా ఈరోజునుండి తన కొత్త సినిమా షూటింగ్ మొదలెట్టేయడానికి రాజమండ్రి చేరుకున్నాడు మెగా హీరో రామ్ చరణ్‌. ఇప్పటికే సుకుమార్ డైరక్షన్లో చేయాల్సిన సినిమా చాలా లేటైపోవడంతో.. అభిమానులు అవతల కంగారుపడిపోతున్నారు. వారి కోసం ఒక మెగా అప్డేట్ ఇదిగో.

రామ్‌చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ డైరక్షన్లో వస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఈరోజు నుండి ఎట్టకేలకు మొదలవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని శివగిరి-సిరివాక గ్రామాల మధ్య వేసిన ఒక ప్రత్యేకమైన గూడెం సెట్‌ లో ఈరోజు నుండి షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకే ఈరోజు ఉదయం ప్రత్యేక ట్రూజెట్ విమానంలో తన అక్క సుస్మితతో కలసి రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న చరణ్‌.. అక్కడ నుండి కారులో లొకేషన్ కు బయలుదేరాడు.

నిజానికి ఈ షూటింగ్ అంతా కేరళలో చేద్దామని అనుకున్నారు కాని.. అక్కడి లొకేషన్లలో కొత్తదనం లేకపోవడంతో ఎట్టకేలకు పశ్చిమగోదావరి జిల్లా బోర్డర్ కోనసీమలో సెట్స్ వేసి ఇక్కడే తీస్తున్నారు. పీరియడ్ డ్రామాగా రానున్న ఈ పల్లెటూరి కథలో చరణ్‌ కొత్తగా కనిపిస్తాడని.. సమంత పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్. ఈ సినిమాకు కూడా సుస్మితే ఫ్యాషన్ డిజైనర్. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News