బాహుబలి స్టార్ గా ప్రభాస్ టాలీవుడ్ లోనే నంబర్ వన్ పారితోషికం అందుకుంటున్నాడన్న టాక్ ఉంది. ప్రభాస్ ఒక్కో ప్రాజెక్టుకి రజనీకాంత్ తరహాలోనే 100కోట్లు అందుకుంటున్నాడని బజ్ ఉంది. ప్రస్తుతం అతడు నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాలకు ఇదే రేంజులో పారితోషికాలు ముడుతున్నాయి.
ఇప్పుడు ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ ఆ రేంజు పారితోషికం అందుకుంటున్నాడని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన శంకర్ మూవీకి అతడు దాదాపు 80కోట్లు వసూలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. చరణ్ నటిస్తున్న ఈ 15వ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది. ఆ క్రమంలోనే చరణ్ పారితోషికం కూడా అదే రేంజులో ఉండనుంది.
శంకర్ ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉండగా.. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారని తెలిసింది. ఇందులో బహుభాషా స్టార్లు నటిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వెంటనే చరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంలో అవకాశం అందుకోవడం.. అది కూడా శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఇక టాలీవుడ్ టాప్ హీరోల్లో పవన్ కల్యాణ్ - మహేష్ 50 కోట్ల రేంజు పారితోషికాలతో పాటు లాభాల్లో వాటాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పెద్ద రేంజులో పారితోషికం అందుకుంటున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు
బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం 100 కోట్లు పైగా పారితోషికం రూపంలో అందుకుంటున్నారు. ఆ తర్వాత 100కోట్లు పైబడిన పారితోషికం అందుకునే గ్రేట్ హీరోగా కిలాడీ అక్షయ్ కుమార్ పేరు మార్మోగుతోంది. ఇక ఖాన్ లనే వెనక్కి నెట్టి ఇటీవల వార్షికాదాయంలో సక్సెస్ రేటులో దూసుకొచ్చిన అక్షయ్ అంతకంతకు పారితోషికం పెంచేస్తూ 135 కోట్ల రేంజుకు చేరాడు.
ఇక తన జీవితంలో ప్రతిరోజూ పనిచేసే హీరో ఎవరు? అంటే అది అక్షయ్ కుమార్ మాత్రమే. సెట్స్ లో లేనప్పుడు సూపర్ స్టార్ స్క్రిప్ట్ లను వింటాడు. ఏదైనా సినిమాకి సంతకం చేసేప్పుడే రిలీజ్ తేదీల్ని నిర్ణయిస్తాడు. ప్రస్తుతం 2021 మాత్రమే కాకుండా 2022 లో కూడా తన విడుదలలకు సంబంధించిన తేదీల్ని ఖరారు చేస్తున్నాడు అక్షయ్. ప్రత్యేకంగా తన తేదీలను బ్లాక్ చేసిన నిర్మాతలకు తాజాగా అక్షయ్ అల్టిమేటమ్ జారీ చేశాడు. మార్కెట్లో తనకు పెరిగిన అధిక డిమాండ్ కారణంగా తన నటన రుసుమును మరింత పెంచాలని నిర్ణయించాడు.తన నటనా రుసుమును రూ. 2022 లో విడుదల కానున్న చిత్రాలకు 117 కోట్ల నుంచి 135 కోట్లకు పెంచాడు.
లాక్ డౌన్ లో గత కొన్ని నెలలుగా అక్షయ్ కుమార్ తన ఫీజులను క్రమంగా పెంచుతూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.99 కోట్ల నుండి రూ.108 కోట్లకు పెంచారు. చివరకు ఇటీవల సంతకం చేసిన చిత్రాల కోసం 117 కోట్లకు ఫిక్సయ్యాడు.
ఇప్పుడు ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ ఆ రేంజు పారితోషికం అందుకుంటున్నాడని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ప్రారంభమైన శంకర్ మూవీకి అతడు దాదాపు 80కోట్లు వసూలు చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. చరణ్ నటిస్తున్న ఈ 15వ చిత్రాన్ని దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది. ఆ క్రమంలోనే చరణ్ పారితోషికం కూడా అదే రేంజులో ఉండనుంది.
శంకర్ ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉండగా.. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారని తెలిసింది. ఇందులో బహుభాషా స్టార్లు నటిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత వెంటనే చరణ్ మరో భారీ పాన్ ఇండియా చిత్రంలో అవకాశం అందుకోవడం.. అది కూడా శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తుండడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. ఇక టాలీవుడ్ టాప్ హీరోల్లో పవన్ కల్యాణ్ - మహేష్ 50 కోట్ల రేంజు పారితోషికాలతో పాటు లాభాల్లో వాటాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి పెద్ద రేంజులో పారితోషికం అందుకుంటున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు
బాలీవుడ్ లో ఖాన్ ల త్రయం 100 కోట్లు పైగా పారితోషికం రూపంలో అందుకుంటున్నారు. ఆ తర్వాత 100కోట్లు పైబడిన పారితోషికం అందుకునే గ్రేట్ హీరోగా కిలాడీ అక్షయ్ కుమార్ పేరు మార్మోగుతోంది. ఇక ఖాన్ లనే వెనక్కి నెట్టి ఇటీవల వార్షికాదాయంలో సక్సెస్ రేటులో దూసుకొచ్చిన అక్షయ్ అంతకంతకు పారితోషికం పెంచేస్తూ 135 కోట్ల రేంజుకు చేరాడు.
ఇక తన జీవితంలో ప్రతిరోజూ పనిచేసే హీరో ఎవరు? అంటే అది అక్షయ్ కుమార్ మాత్రమే. సెట్స్ లో లేనప్పుడు సూపర్ స్టార్ స్క్రిప్ట్ లను వింటాడు. ఏదైనా సినిమాకి సంతకం చేసేప్పుడే రిలీజ్ తేదీల్ని నిర్ణయిస్తాడు. ప్రస్తుతం 2021 మాత్రమే కాకుండా 2022 లో కూడా తన విడుదలలకు సంబంధించిన తేదీల్ని ఖరారు చేస్తున్నాడు అక్షయ్. ప్రత్యేకంగా తన తేదీలను బ్లాక్ చేసిన నిర్మాతలకు తాజాగా అక్షయ్ అల్టిమేటమ్ జారీ చేశాడు. మార్కెట్లో తనకు పెరిగిన అధిక డిమాండ్ కారణంగా తన నటన రుసుమును మరింత పెంచాలని నిర్ణయించాడు.తన నటనా రుసుమును రూ. 2022 లో విడుదల కానున్న చిత్రాలకు 117 కోట్ల నుంచి 135 కోట్లకు పెంచాడు.
లాక్ డౌన్ లో గత కొన్ని నెలలుగా అక్షయ్ కుమార్ తన ఫీజులను క్రమంగా పెంచుతూనే ఉన్నాడు. ఇప్పటికే రూ.99 కోట్ల నుండి రూ.108 కోట్లకు పెంచారు. చివరకు ఇటీవల సంతకం చేసిన చిత్రాల కోసం 117 కోట్లకు ఫిక్సయ్యాడు.