భార్యకు రూ.120 కోట్ల అపురూపమైన బహుమానం

Update: 2022-12-31 07:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకనే మరియు రణ్వీర్ సింగ్ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటూనే ఉంటారు. ఆ మధ్య వీరిద్దరూ విడిపోయారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ వీరిద్దరిది విడిపోయేంత వీక్ బంధం కాదని మరోసారి నిరూపితం అయ్యింది. ఇద్దరి యొక్క బంధం అపురూపం అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటూ ఉంటారు.

ఇద్దరు కూడా బాలీవుడ్‌ లో టాప్ స్టార్స్ గా దూసుకు పోతున్నారు. ఏడాదికి వంద కోట్ల వరకు ఆదాయం కలిగి ఉన్న వీరు ముంబైలో అత్యంత ఖరీదైన ఏరియాలో నిర్మించిన ప్రత్యేక ఇంట్లో కొత్త సంవత్సరం సందర్భంగా అడుగు పెట్టబోతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

దీపికా అభిరుచికి తగ్గట్లుగా 11,266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంద్రభవనం వంటి ఇంటిని రణ్వీర్ సింగ్ రెడీ చేయించాడు.

దాదాపు రెండు మూడు నెలలు ప్రత్యేకంగా రణ్వీర్ శ్రద్ద పెట్టి ఈ ఇంటిని ఫినిషింగ్ చేయించాడు అంటూ ఆయన సన్నిహితులు బాలీవుడ్‌ మీడియా వద్ద చెప్పుకొచ్చారు.

ఈ ఇంటి కోసం రణ్వీర్ సింగ్‌ ఏకంగా 119 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని వారు చెబుతున్నారు. ఈ ఇల్లు షారుఖ్‌ ఖాన్‌ మరియు సల్మాన్‌ ఖాన్‌ ఇళ్లకు సమీపంలో ఉంటుందట. ఈ ఇంట్లో అద్భుతమైన టెర్రస్‌.. సముద్రపు వ్యూ.. జిమ్‌.. స్విమ్మింగ్‌ పూల్‌ ఉండి అత్యంత విలాసంగా ఉంటుందట.

ప్రతి మూల కూడా అత్యాధునిక హంగులను మరియు అధునాతన ఇంటీరియర్ తో డిజైన్‌ చేయించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 120 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఇంద్రభవనం వంటి ఇల్లును కొత్త సంవత్సరం కానుకగా దీపికా కు రణ్వీర్ సింగ్‌ అందిస్తున్నారట. కొత్త సంవత్సర వేడుకలు కొత్త ఇంట్లో వీరు చేసుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News