చరణ్.. ఎన్టీఆర్ యూఎస్ ఎందుకెళ్లారు?

Update: 2018-03-14 04:50 GMT
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రంగస్థలం షూటింగ్ కంప్లీట్ చేసి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ పై ఫోకస్ పెట్టాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం కసరత్తు చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఈ రెండు సినిమాల షూటింగులు కంప్లీట్ చేశాక దర్శక ధీరుడు రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ మూవీకి టైం కేటాయించనున్నారు.

తాజాగా ఎన్టీఆర్.. రామ్ చరణ్ కలిసి యూఎస్ ట్రిప్ కు వెళ్లి వెంటనే తిరిగొచ్చారు. ఇదేమీ జాలీ ట్రిప్పేమీ కాదు. ఒకవేళ అయింటే అంత వెంటనే వచ్చేయరు. వీళ్లిద్దరూ ఎందుకెళ్లారా అన్నది ఆరా తీస్తే రాజమౌళి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఈ మినీ టూర్ కు వెళ్లొచ్చారు. రాజమౌళి పెద్దగా గ్రాఫిక్స్ తో పనిలేకుండా ఈ మల్టీ స్టారర్ కంప్లీట్ చేయాలని ఆలోచిస్తున్నాడు. కానీ సినిమాలో మరీ బాహుబలి.. ఈగ స్థాయిలో కాకపోయినా కొద్దోగొప్పో గ్రాఫిక్స్ తో పనిపడుతుంది. అందుకే ఈ ఇద్దరు హీరోల్ని అమెరికాకు పంపి టోటల్ బాడీ స్కాన్ చేయించాడు రాజమౌళి.

రాజమౌళి సినిమా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. గ్రాఫిక్స్ వర్క్ ముందే కొలిక్కివచ్చేస్తే అందుకోసం అదనపు టైం కేటాయించాల్సిన అవసరం ఉండదనేది జక్కన్న ఐడియా. అందుకే బాడీ స్కాన్ పూర్తయిపోతే అందుకు తగ్గట్టు గ్రాఫిక్ టీం పనులు మొదలెట్టేస్తుంది. సినిమా షూటింగ్ అయిపోయేపాటికి గ్రాఫిక్స్ కూడా అయిపోతాయి. మొత్తానికి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ సూపరనే చెప్పాలి.
Tags:    

Similar News