సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును మళ్లీ సీబీఐ విచారించాలంటున్న బాలీవుడ్ నటుడు..!

Update: 2022-12-29 12:52 GMT
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారింది. సుశాంత్ మరణించి ఏళ్లు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి మాత్రం కనిపించడం లేదు. దీంతో సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదు ఎవరో హత్య చేశారనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలోనూ సుశాంత్ సింగ్ మరణంపై అతని ఫ్యాన్స్ బాలీవుడ్ నటులపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

బాలీవుడ్లో నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ మరణించాడని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈక్రమంలోనే బాయ్ కాట్ బాలీవుడ్ హ్యాష్ టాగ్ ను అప్పట్లో ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చారు. దీంతో సుశాంత్ సింగ్ మరణ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెల్సిందే.

సుశాంత్ సింగ్ కేసును అందరూ మరిచిపోతున్న తరుణంలో కూపర్ హాస్పత్రి రిటైర్డ్ ఉద్యోగి రూప్ కుమార్ షా అతడిపై మరణంపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మరోసారి సుశాంత్ సింగ్ మృతి అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల రూప్ కుమార్ షా మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ బాడీని చితకబాదిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపాడు.

పలుచోట్ల అతడికి ఎముకలు విరిగిపోయాయని తెలిపాడు. కంటిపై బలంగా పిడిగుద్దులు గుద్దితే కళ్ల చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడినట్లు వివరించాడు. అతడిది ఆత్మహత్య అయ్యే అవకాశం లేదని ఎవరో హత్య చేసి ఉంటారని సుశాంత్ సింగ్ బాడీని పోస్టుమార్టం చేసిన రూప్ కుమార్ షా వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రూప్ కుమార్ షా వ్యాఖ్యల నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ కేసు మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.

సుశాంత్ సింగ్ అభిమానులు సైతం సుశాంత్ కేసు తిరిగి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు శేఖర్ సుమన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ సుశాంత్ సింగ్ కేసును సీబీఐ మరోసారి దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని కోరాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News