ఫొటోటాక్‌ : కొడుకు ను ఫస్ట్‌ టైమ్‌ చూపించిన గాయిని

Update: 2021-06-03 05:30 GMT
ప్రముఖ గాయిని శ్రేయ ఘోషల్ ఇటీవలే బాబుకు జన్మనిచ్చింది. తనకు బాబు పుట్టిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఇటీవలే తెలియజేసిన ఈ స్టార్‌ సింగర్‌ తాజాగా భర్తతో కలిసి తన కొడుకు ఫొటోను షేర్‌ చేసింది. అలాగే తన కొడుకుకు దేవ్యాన్‌ ముఖోపాధ్యాయ అనే పేరును పెట్టినట్లుగా ప్రకటించింది. కొడుకు ను పూర్తిగా చూపించకున్నా కూడా ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. పెద్ద ఎత్తున ఈ ఫొటోను నెటిజన్స్‌ వైరల్‌ చేస్తున్నారు.

ఫొటోతో పాటు ఇన్‌ స్టా గ్రామ్‌ లో శ్రేయ ఘోషల్‌.. మే 22న వచ్చిన ఇతడు మా జీవితాలను మార్చేశాడు. మొదటి సారి అతడిని చూసిన సమయంలో చాలా సంతోషం కలిగింది. ఒక తల్లిగా తండ్రిగా భావన కలిగించేందుకు అతడి పుట్టుక జరిగింది. అతడిపై మాకు ఉన్న ప్రేమ కంట్రోల్‌ చేయలేనిది స్వచ్చమైనది. మా కల సాకారం అయ్యిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. నేను ఆధిత్య జీవితంలోనే గొప్ప బహుమానం దక్కినందుకు సంతోషంగా ఉన్నాం అంటూ పోస్ట్‌ చేసింది.

శ్రియ ఘోషల్‌ మొదటి సారి తన కొడుకు ఫొటోను షేర్‌ చేసిన నేపథ్యంలో ఎంతో మంది నెట్టింట ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో పాటలు పాడి అభిమానులను సొంతం చేసుకున్న శ్రేయ ఘోషల్‌ గత కొన్నాళ్లుగా ప్రెగ్నెన్సీ వల్ల పాటలకు కాస్త దూరం అయ్యింది. బాబు పుట్టుకతో మళ్లీ ఆమె తన గానామృతంను కొనసాగించే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News