క్షణం రీమేక్ రెడీ అయిపోయింది

Update: 2017-02-05 07:06 GMT
గత ఏడాది పెద్ద అంచనాల్లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ‘క్షణం’. పబ్లిసిటీ ఖర్చుతో కలిపి ఈ చిత్రంపై పీవీపీ సినిమా రూ.2 కోట్ల పెట్టుబడి పెడితే.. దానికి పది రెట్ల దాకా గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ స్థాయి థ్రిల్లర్ లా కనిపించిన ఈ చిత్రాన్ని హిందీ.. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి చాలామంది పోటీ పడ్డారు. తమిళంలో సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ ఈ చిత్ర రీమేక్ రైట్స్ తీసుకున్నాడు. చడీచప్పుడు లేకుండా సినిమాను మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేయించాడు. ‘బేతాళుడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.

‘క్షణం’ రీమేక్ కు తమిళంలో ‘సత్య’ అనే పేరు పెట్టారు. కమల్ హాసన్ ఒకప్పుడు ఇదే పేరుతో ఒక సూపర్ హిట్ సినిమా చేశాడు. పైగా తండ్రి పేరు కూడా కలిసొస్తుంది కాబట్టి ఈ ,పేరును ఎంచుకున్నాడు శిబిరాజ్. ఈ చిత్రానికి నిర్మాత కూడా అతనే. కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. హీరో చేతులు వెనక్కి కట్టేసి ఉన్న పోజుతో ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. రెస్పాన్స్ బాగానే ఉంది. తెలుగులో హీరోయిన్ పాత్ర చేసిన ఆదాశర్మే తమిళంలోనూ నటిస్తోంది. అనసూయ పాత్రను ఎవరు చేస్తున్నారో చూడాలి. ఈ వేసవిలో ‘సత్య’ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు హిందీలో ‘క్షణం’ రీమేక్ హక్కుల్ని వశు భగ్నాని తీసుకున్నాడు. ఇంకా నటీనటుల సంగతి ఖరారవ్వలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News