వెండితెర హీరోగా బొత్స మేనల్లుడు

Update: 2016-03-18 15:30 GMT
మొన్నటి వరకు బొత్స సత్యనారాయణ టాలీవుడ్ లో పెట్టుబడులు పెడుతున్నారనే ప్రచారం వుంది. బండ్ల గణేష్ అతనికి బినామీ నిర్మాత అని అందరికీ తెలిసిందే. మరి ఇతర హీరోలకు డబ్బులు ఖర్చు చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో... తన మేనల్లుడినే హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమాతో భరత్ సోమి నిర్మాతగా ఎస్.ఎస్.రాజమౌళి క్యాంపు నుంచి వచ్చిన త్రికోఠి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. బోత్స సత్యనారాయణ మేనల్లుడు రంజిత్ సోమి హీరోగా - పలక్ లాల్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్నందని దర్శకుడు తెలిపారు.

బోయపాటి శ్రీను వద్ద ఆస్థాన డైలాగ్ రైటర్ గా సింహా - లెజెండ్ లాంటి సినిమాలకు మాటలు అందించిన ఎం.రత్నం ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అలాగే ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్ రావు ఈ చిత్రానికి ఎడిటింగ్ అందిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రం ప్రారంభమైంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని త్వరలోనె సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. రామనాయుడు స్టూడియోలో జరిగిన ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణతో పాటు.. అతని సతీమణి - మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ - ఎస్.ఎస్.రాజమౌళి దంపతులు - కీరవాణి - నిర్మాతలు డి.సురేష్ బాబు - దిల్ రాజు - బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ - సినిమాటోగ్రాఫర్ సెంథిల్ - అజయ్ తదితరులు హజరయ్యారు.
Tags:    

Similar News