ఈసారి బాలీవుడ్‌ స్టార్‌ ను రంగంలోకి..

Update: 2018-09-10 10:18 GMT
సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్‌ బాబు సక్సెస్‌ ఫ్లాప్‌ లతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. సుధీర్‌ బాబు గత చిత్రం ‘సమ్మోహనం’ మంచి క్లాస్‌ సక్సెస్‌ ను అందుకుంది. కెరీర్‌ లో మొదటి సారి మంచి వసూళ్లను సుధీర్‌ బాబు చూశాడంటూ ట్రేడ్‌ పండితులు సైతం ‘సమ్మోహనం’ గురించి కితాబు ఇచ్చారు. ఇలాంటి సమయంలో సుధీర్‌ బాబు చేసిన తదుపరి చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రం కథ నచ్చడంతో సుధీర్‌ బాబు స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రంను ముందుగా  ఈనెల 13న విడుదల చేయాలని భావించారు. కాని అదే రోజున అక్కినేని వారి దంపతులు నాగ చైతన్య - సమంతలు బాక్సాఫీస్‌ ముందుకు రాబోతున్నారు. అందుకే వారం ఆలస్యంగా సుధీర్‌ బాబు సినిమాను విడుదల చేయబోతున్నాడు.

సుధీర్‌బాబు కెరీర్‌ ఆరంభం నుండి చూస్తే ఎక్కువ సినిమాల ప్రమోషన్స్‌కు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు - సూపర్‌ స్టార్‌ కృష్ణ లు వచ్చేవారు. కాని ఈసారి మాత్రం బాలీవుడ్‌ స్టార్‌ టైగర్‌ ష్రాఫ్‌ రంగంలోకి దిగాడు. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం ట్రైలర్‌ ను టైగర్‌ ష్రాఫ్‌ తో రిలీజ్‌ చేయించాడు. టైగర్‌ ష్రాఫ్‌ తో సుధీర్‌ బాబుకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరు కలిసి ఒక బాలీవుడ్‌ చిత్రంలో కూడా నటించిన విషయం తెల్సిందే.

సుధీర్‌ బాబు - టైగర్‌ ష్రాఫ్‌ లు గతంలో ‘బాఘి’లో నటించారు. ఆ చిత్రంలో సుధీర్‌ బాబు విలన్‌ గా నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా బాలీవుడ్‌ నుండి మంచి ఆఫర్లు సుధీర్‌ బాబుకు వచ్చాయి. కాని తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా కొనసాగాలనే ఉద్దేశ్యంతో వాటిని సున్నితంగా తిరష్కరించాడు. తాజాగా టైగర్‌ ష్రాఫ్‌ తో నన్ను దోచుకుందువటే చిత్రం ట్రైలర్‌ ను విడుదల చేయించడంతో ఇంకా బాలీవుడ్‌ తో సుధీర్‌ బాబుకు రిలేషన్‌ షిప్‌ కొనసాగుతుందని తెలుస్తోంది. టైగర్‌ ష్రాప్‌ ప్రమోషన్‌ తో నన్ను దోచుకుందువటే చిత్రంకు ఏ స్థాయిలో క్రేజ్‌ దక్కుతుందో చూడాలి.

Tags:    

Similar News