మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన మెగా హీరో

Update: 2022-05-06 09:30 GMT
మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ స్టార్ సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం త‌న పేరుని సాయితేజ్‌గా మార్చుకున్న ఈ యంగ్ హీరో గ‌త ఏడాది దేవా క‌ట్టా తెర‌కెక్కించిన పొలిటిక‌ల్ డ్రామా 'రిప‌బ్లిక్‌' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌మాదవ‌శాత్తు యాక్సిడెంట్ కు గుర‌య్యారు. గ‌చ్చిబౌలీలో స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ స్కిడ్ కావ‌డంతో ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఈ ప్ర‌మాదం త‌రువాత అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ని స్థానికులు స‌మీప హాస్పిట‌ల్‌లో చేర్పించారు.

ఆ త‌రువాత ఆయ‌న‌ని కుటుంబ స‌భ్యులు అపోలో హాస్పిట‌ల్ కు త‌ల‌రించి మెరుగైన చికిత్స‌ని అందించారు. ఈ క్ర‌మంలో ఆయ‌నకు మైన‌ర్ ఆప‌రేష‌న్ జ‌రిగింది. నెల రోజుల పాటు హాస్పిట‌ల్ లోనే ట్రీట్‌మెంట్ తీసుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఆ త‌రువాతే డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి సుర‌క్షితంగా చేరుకున్నారు. అప్ప‌టి నుంచి ఇంటి ప‌ట్టునే వుంటూ విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవ‌లే కోలుకున్న ఆయ‌న త‌న 15వ సినిమా సెట్ లోకి అడ‌గుపెట్టారు.

ఈ మ‌ధ్య కాలంలో బాగా బ‌రువు పెరిగిన సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల ల‌భించిన టైమ్ లో త‌న బ‌రువుని త‌గ్గించుకున్నార‌ట‌. వ‌ర్క‌వుట్ లు చేస్తూ స్లిమ్ లుక్ లోకి వ‌చ్చేసి ఫిట్ గా మారిపోయినట్టుగా తెలుస్తోంది.

ఇటీవ‌ల హైద‌రాబాద్ లో ఫ్యాన్స్ మీట్ ని నిర్వహించార‌ట‌. ఈ కార్య‌క్ర‌మంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ స్లిమ్‌గా పూర్తి ఫిట్ నెస్ తో క‌నిపించార‌ని అని చెబుతున్నారు. ఆయ‌న లుక్ చూసిన ఫ్యాన్స్ ఒక్క‌సారిగా స‌ర్ ప్రైజ్ అయ్యార‌ట‌. ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఫ్యాన్స్ ఫ్యాన్స్ మీట్ లో పాల్గొని హీరోతో పాటు క‌లిసి భోజ‌నం చేయ‌డం విశేషం.

ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న 15వ చిత్రంలో న‌టిస్తున్నారు. థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో తెర‌కెక్కుతున్న ఈ  చిత్రానికి కార్తిక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తో పాటు శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ మూవీతో పాటు సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రో రీమేక్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. స‌ముద్ర‌ఖ‌ని త‌మిళంలో న‌టించి కూపొందించిన 'వినోదాయ సితం' చిత్రాన్ని  తెలుగులో ప‌వ‌న్ కల్యాణ్ తో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ కీల‌క పాత్ర‌లో సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌నిపించ‌బోతున్నారు.

త్రివిక్ర‌మ్ డైలాగ్స్‌, స్క్రీన్ ప్లే అందించ‌నున్న ఈ చిత్రానికి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన అఫీష‌య‌ల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇదిలా వుంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ మ‌రో మూడు ప్రాజెక్ట్ ల‌ని కూడా లైన్ లో పెట్టిన‌ట్టుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఇవి చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్నాయ‌ని, ఫైన‌ల్ టాక్స్ పూర్తి కాగానే వ‌న్ బై వ‌న్ అనౌన్స్ చేయ‌డం జ‌రుగుతుంద‌ట‌. ఇంత వ‌ర‌కు బ్రేక్ తీసుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇక పై బ్యాక్ టు బ్యాక్ బ్రేక్ లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది.
Tags:    

Similar News