బొత్స బంధువుతో రాజమౌళి శిష్యుడు

Update: 2016-03-17 11:30 GMT
ఈ మధ్య కాలంలో దర్శకధీరుడు రాజమౌళి శిష్యులు చాలామందే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. దర్శకులుగా మారి ఇండస్ట్రీలో సెటిల్ అవుదామని ట్రై చేశారు. వారిలో ఎవరూ సక్సెస్ కాలేకపోయారు కానీ.. త్రికోటి మాత్రం పర్లేదనే ఫీలింగ్ కలిగించగలిగాడు.

ఇతను తీసిన దిక్కులు చూడకు రామయ్య కమర్షియల్ గా ఆకట్టుకకోపోయినా.. విజువలైజేషన్ పరంగా బాగుంది అనిపించుకుంది. ఇప్పుడీ త్రికోటి చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాకి రెడీ అయ్యాడు. సొమ్మి ఫిలింస్ బేనర్ పై తెరకెక్కనున్న ఈ మూవీలో.. హీరోగా రంజిత్ సోమి నటించనున్నాడు. ఇతను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు దగ్గరి బంధువు. అబ్బాయితో అమ్మాయి చిత్రంతో ఆకట్టుకున్న పాలక్ లల్వానిని హీరోయిన్ గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. హైద్రాబాద్ లో రేపు ఈ చిత్రానికి ముహూర్తం షాట్ తీయనుండగా.. దర్శుకులు ఎస్ఎస్ రాజమౌళి - వివి వినాయక్ లు హాజరుకానున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపాలని దర్శకుడు నిర్ణయించాడు. తన రెండో సినిమాతో ఇండస్ట్రీకి తన ట్యాలెంట్ ఏంటో చూపించాలనే పట్టుదలతో ఉన్నాడు త్రికోటి.
Tags:    

Similar News