ఫైనల్ గా విజయ్ ను డామినేట్ చేసిన అజిత్

Update: 2023-01-18 10:30 GMT
తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా అజిత్ కుమార్, విజయ్ కొనసాగుతున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఈ రేంజ్ స్టార్ ఇమేజ్‌తో కోలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నదే వీళ్లే అని చెప్పవచ్చు. వీళ్లిద్దరు పలుమార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. అయితే ఈ సంక్రాంతికి అజిత్ తునివుతో, విజయ్ వారసుడుతో బరిలోకి దిగారు.

అజిత్ హీరోగా నటించిన 'తెగింపు' తమిళ్ లో తునివు సినిమాతో పాటు విజయ్ హీరోగా నటించిన 'వారసుడు  తమిళనాడులో వారిసుగా ఒకేరోజు విడుదలయ్యాయి. కానీ తెలుగులో విజయ్ సినిమా 'వారసుడు' మూడు రోజులు ఆలస్యంగా విడుదలైంది. వీళ్లిద్దరు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడంతో.. తమిళనాట భారీ అంచనాలు నెలకొన్నాయి.

 అజిత్, విజయ్ ఇప్పటికే 9 సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. ఇపుడు తునివు వర్సెస్ వారిసు సినిమాలతో మరోసారి ఒకే రోజు బాక్సాఫీస్ వార్‌కు దిగారు.  దాదాపు 8 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్లిద్దరు తమిళ బాక్సాఫీస్ దగ్గర ఒకే రోజు పోటీ పడ్డారు.

అజిత్ తునివుతో పోటీ పడుతుంటే.. విజయ్.. వారిసు సినిమాతో పలకరించగా... ఈ రెండు సినిమాలు తెలుగులో 'తెగింపు' 'వారసుడు' పేరుతో రిలీజ్ అయ్యాయి.

అయితే ఈ పోటీలో మాత్రం అజిత్ పైచేయి సాధించారని తెలుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన వారసుడు ఏడురోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక అదే రోజు రిలీజ్ అయిన అజిత్ తునివు ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్లుసాధించింది. దీన్ని బట్టి చూస్తే.. విజయ్ పై అజిత్ పై చేయి సాధించాడు.

ఇక 'వారిసు'సినిమాను తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. మరోవైపు అజిత్ హీరోగా నటించిన 'తునివు' యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News