ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ సంగ‌తులేవీ?

Update: 2021-11-19 06:16 GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా మాస్ డైరెక్ట‌ర్ వి. వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో `ఛ‌త్ర‌ప‌తి` చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. `శివాజీ` టైటిల్ తో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. పెన్ స్టూడియోస్ ప‌తాకం పై జ‌యంతీలాల్ గ‌డ నిర్మిస్తున్నారు.

జులై లో ఈ సినిమా ప్రారంభోత్స‌వం జ‌రిగింది. షూటింగ్ ప్రారంభ‌మై నాలుగు నెలలు పూర్త‌యింది. ఐద‌వ నెల ర‌న్నింగ్ లో ఉంది. కానీ ఇప్పటివ‌ర‌కూ ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ ఏవీ చిత్ర యూనిట్ వెల్ల‌డించ‌లేదు. సాయి శ్రీనివాస్ గ‌త సినిమాల అప్ డేట్ ఎప్ప‌టిక‌ప్పుడు అందేది. మీడియా అటెన్ష‌న్ త‌న సినిమాపై ఉండేలా జాగ్రత్త ప‌డేవారు.

కానీ ఈ రీమేక్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్స్ లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో సినిమా షూటింగ్ జ‌రుగుతోందా లేదా..? మ‌ధ్య‌లో నిలిచిపోయిందా? క్యాన్సిల్ అయిందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

మ‌రి ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ లైట్ తీసుకుందా? డైరెక్ట్ హిందీ రీమేక్ కాబ‌ట్టి అక్క‌డ మీడియాలోనైనా ఛ‌త్ర‌ప‌తి టాక్ వినిపిస్తుంది క‌దా అని ఆరా తీసినా అక్క‌డా ఎలాంటి సౌండింగ్ లేదు. మ‌రి ఈ చిత్రాన్ని ఎలాంటి హ‌డావుడి లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసుకుని సైలెంట్ గా ఉన్నారా? అన్న ఊహ‌గానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

కోవిడ్ నేప‌థ్యంలో థియేట‌ర్ రిలీజ్ లేక‌పోతే ఓటీటీకి వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సైలెంట్ గా షూటింగ్ పూర్తిచేసి ప్ర‌చారానికి దూరంగా ఉంటున్నారా? అన్న సందేహం సైతం మొద‌లైంది. మ‌రి ఈ సందేహాల‌న్నింటిపై క్లారిటీ రావాలంటే ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు ముందుకొస్తే గానీ అస‌లు సంగ‌తేమిటన్న‌ది తేల‌దు. అలాగే సాయి శ్రీనివాస్ హీరోగా `స్టూవ‌ర్ట్ పురం దొంగ` చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News